Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణాలలో ఈ జిల్లాలలోనే వర్షాలు!

తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలెర్ట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కూడా వాతావరణ శాఖ అల్పపీడన ప్రభావం ఉంటుందని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా బలపడుతుందని పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల పైన ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు.

నేడు ఈ జిల్లాలలో వర్షాలు

ఈ అల్పపీడనం ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నేడు వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, జనగామ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

rain alert Low pressure approaching Rains in these districts of AP and Telangana imd issues warning

రేపు ఈ జిల్లాలలో వర్షాలు

అల్పపీడన ప్రభావంతో రేపు హన్మకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లా, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం, రాత్రి వేళలలో పొగ మంచు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఏపీపైన కూడా అల్పపీడన ప్రభావం

ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. ఉపరితల గాలులు ఆగ్నేయ తూర్పు దిశలో గంటకు నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వెల్లడించారు. అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కూడా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది .ముఖ్యంగా దక్షిణ తీర ప్రాంతాల పైన , రాయలసీమలోనూ ఈ అల్పపీడన ప్రభావం అధికంగా చూపించనుంది.

ఏపీలో ఈ జిల్లాలలో వర్షాలు

చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాలలో అల్పపీడన ప్రభావంతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం వెళ్లే రైతులు వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదని సూచిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+