చేతగాక పార్టీని అమ్ముకున్నారు: చిరంజీవిపై మాల మహానాడు భగ్గు
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు తెలిపినందుకు గాను కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిపై మాల మహానాడు భగ్గుమంటోంది. చిరంజీవిని తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వబోమని మాల మహానాడు హెచ్చరించింది. చిరంజీవికి వ్యతిరేకంగా సోమవారం మాల మహానాడు ఆందోళన చేపట్టింది.

హైదరాబాదులోని ట్యాంక్బండ్పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు కార్యకర్తలు నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ సందర్భంగా చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

మాల మహానాడు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయం చేతగాక పార్టీని అమ్ముకున్న చిరంజీవి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సిఫార్సు చేయడం చేతగాని తనమని మాల మహానాడు జాతీయాధ్యక్షుడు చెన్నయ్య విమర్శించారు.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications