పెళ్లయ్యాక మరొకరితో ప్రేమ: అది అసాధ్యమని తెలిసి ఇద్దరూ ఆత్మహత్య..
ప్రేమను వదులుకోలేక, దాన్ని సొంతం చేసుకోలేక.. తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: పెళ్లయ్యాక.. ఆమె మరొకరితో ప్రేమలో పడింది. అప్పటికే ఇద్దరు సంతానం ఉండటంతో.. సమాజం తమను ఛీత్కరిస్తుందని కృంగిపోయింది. ప్రేమను వదులుకోలేక, దాన్ని సొంతం చేసుకోలేక.. తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కావ్య(24) అనే వివాహిత భర్త, పిల్లలతో కలిసి కాప్రా జమ్మిగడ్డ ప్రాంతంలో నివాసం ఉంటోంది. అదే ప్రాంతంలో నివాసముంటున్న నాగరాజు(25) అనే ఓప్రైవేట్ ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. అయితే ఇద్దరం కలిసి బ్రతకడం అసాధ్యమని భావించిన వీరు.. కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ నెల 27న రాత్రి రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు వారి మృతదేహాలను అప్పగించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications