మిస్టర్ వరల్డ్గా హైదరాబాదీ: చరిత్ర సృష్టించిన రోహిత్
లండన్: మిస్టర్ వరల్డ్ 2016గా హైదరాబాద్కు చెందిన యువకుడు రోహిత్ ఖండేల్వాల్ ఎంపికయ్యాడు. మిస్టర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ను గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. జులై 19న ఇంగ్లాండ్లోని సౌత్పోర్ట్లో జరిగిన మిస్ వరల్డ్ ఫైనల్స్లో మొత్తం 46 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు.
'మిస్టర్ ఇండియా'గా హైదరాబాద్ యువకుడు..!
ఈ పోటీలో అందరినీ వెనక్కి నెట్టిన రోహిత్ 'మిస్టర్ వరల్డ్'గా ఎంపికయ్యాడు. ఈ టైటిల్తో పాటు రోహిత్ 50 వేల డాలర్ల (దాదాపు రూ.35 లక్షలు)ను ప్రైజ్మనీగా బహుమతిగా అందుకున్నాడు. పోటీలు ముగిసిన వెంటనే 'మిస్టర్ వరల్డ్- 2016' నిర్వాహకులు తమ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో రోహిత్ విజయాన్ని ప్రకటించారు.
మిస్టర్ వరల్డ్ టైటిల్తో పాటు వరల్డ్ మల్టీమీడియా అవార్డు, ప్రపంచ టాలెంట్, మాబ్స్టార్ పీపుల్స్ ఛాయిస్ లాంటి సబ్ టైటిళ్లకు కూడా రోహిత్ పోటీ పడ్డాడు. టైటిల్ను గెలిచిన అనంతరం మిస్టర్ వరల్డ్ 2014 నిక్లాస్ పీడరెన్స్తో కలిసి దిగిన ఫోటోను రోహిత్ తన ఇన్స్టాగ్రాంలో పోస్టు చేశాడు.
కాగా, గతేడాది ముంబైలో ప్రోవోగ్ పర్సనల్ కేర్ నిర్వహించిన పోటీల్లో రోహిత్ ఖండేల్వాల్ 'మిస్టర్ ఇండియా-2015' టైటిల్ గెలుచుకున్నాడు. ఈ విజయంతోనే రోహిత్ మిస్టర్ వరల్డ్ పోటీల్లో భారతదేశానికి ప్రాతనిధ్యం వహించాడు. మోడలింగ్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలేసి ఓ సాధారణ యువకుడిగా రోహిత్ ముంబైలో అడుగుపెట్టాడు.
మార్వాడీ కుటుంబానికి చెందిన రోహిత్ పుట్టంది, పెరిగింది చదివింది అంతా హైదరాబాద్లోనే కావడం విశేషం. మోడలింగ్ రంగంలోకి ప్రవేశించక ముందు స్పెస్ జెట్ ఎయిర్ లైన్స్, డెల్ ఇంటర్నేషనల్లో రోహిత్ పనిచేశాడు. బిందాస్ ఛానల్లో 'యే హై ఆషికీ' ఎపిసోడ్లో కూడా నటించాడు. దీంతో పాటు బీ ఛానెల్లో ప్రసారమవుతున్న 'మిలియన్ డాలర్ గర్ల్' సీరియల్లో ముఖ్యమైన పాత్రను పోషించాడు.