గొల్లాఘాట్ శివారులో పులుల సంచారం: నాలుగు గుంపుగా (వీడియో)
ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి పులుల సంచారం కలకలం రేపుతోంది. భీంపూర్ మండలంలోని గొల్లఘాట్ శివారులో పులులు కనిపించాయి.
ఆదిలాబాద్: జిల్లాలో మరోసారి పులుల సంచారం కలకలం రేపుతోంది. భీంపూర్ మండలంలోని గొల్లఘాట్ శివారులో పులులు కనిపించాయి. గురువారం రాత్రి నాలుగు పులులు రోడ్డు దాటుతూ కనిపించాయి. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి పులులు రోడ్డు దాటడం చూసి.. వెంటనే తన ఫోన్లో వీడియో తీశాడు. ప్రస్తుతం పులులు సంచరిస్తున్న వీడియో వైరల్గా మారింది.
పిప్పల్ కోటి రిజర్వాయర్ పనుల కోసం ఓ డ్రైవర్ మట్టి తరలిస్తుండగా.. గొల్లఘాట్ వద్దకు రాగానే.. నాలుగు పులులు రోడ్డుతూ కనిపించాయి. వెంటనే తన ఫోన్లో ఆ దృశ్యాలను బంధించాడు. వాహనం వెలుగులో ఆ పులులు రోడ్డు దాటుతూ కనిపించాయి. వెంటనే బ్యారేజీ పనుల పర్యవేక్షణ అధికారికి సమాచారం అందించాడు.

ఈ సమాచారం అందుకున్న సదరు అధికారి అటవీ శాఖ అధికారులకు విషయం చెప్పాడు. పులులు సంచరిస్తున్న విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు.. అక్కడికి వచ్చి పులుల అడుగులను పరిశీలించారు. పులుల సంచారం నిజమేనని తేల్చారు. గొల్లఘాట్ గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు రాత్రిపూట అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. పులులను పట్టుకునేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Panic triggered among the villagers of the #Adilabad dist, after a tipper lorry driver spotted a group of four #Tigers on the road, near Pippalkoti reservoir in Bhimpur Mandal and he captured the wild cats in his cellphone.#Telangana #RoyalBengalTiger #Wildcats #wildlife pic.twitter.com/U2CBUMYjxm
— Surya Reddy (@jsuryareddy) November 14, 2022
గత కొంత కాలంగా ఆదిలాబాద్ జిల్లాలో పులులు సంచారంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం నాలుగు పులులు ఇక్కడ సంచరించాయి. ఇప్పుడు మరోసారి తాజాగా కనిపించాయి. తమ పశువులు, మనుషులపైనా దాడులు చేస్తాయని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా పులులను పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications