భారత్ డిఎన్ఏలోనే సహనం: టిఆర్ఎస్ ఎంపీ, పేదరికంపై అసహనం: గల్లా జయదేవ్
న్యూఢిల్లీ: భారత దేశ డీఎన్ఏలోనే అసహనం అనే పదానికి తావులేదని టిఆర్ఎస్ భువనగిరి పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్ మంగళవారం అన్నారు. అసహనం పైన లోకసభలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మాట్లాడారు.
భారత దేశ డీఎన్ఏలోనే అసహనం లేదన్నారు. రాజకీయ లబ్ది కోసమే కొందరు అసహనాన్ని తెరమీదకు తెస్తున్నారని విమర్శించారు. రాజకీయాల కోసం ప్రజలను విడదీయొద్దన్నారు. అయినా అసహనం రాజకీయ పార్టీల మధ్యే ఉంది కానీ ప్రజల మధ్య లేదని చెప్పారు.
పేదరికంపై అసహనం కావాలి: గల్లా జయదేవ్
ఎంపీ గల్లా జయదేవ్ సహనంపై స్పందించారు. సహనం అనేది భారతీయుల సంస్కృతిలో భాగమన్నారు. కొందరు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. లౌకికం అన్న పదాన్ని దుర్వినియోగం చేశారని
మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు చేసి పశ్చిమ ఆసియాలో శాంతి లేకుండా చేశారన్నారు. అవినీతి, పేదరికంలాంటి అంశాలపై అసహనం అవసరమన్నారు.

మత ఘర్షణలు తగ్గాయి
గత ఏడాది దేశంలో కేవలం నాలుగు మత ఘర్షణ సంఘటనలు చోటుచేసుకున్నాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రశ్నకు లోకసభలో సమాధాం చెప్పారు. దేశవ్యాప్తంగా అలాంటి ఘటనలు తగ్గినట్లు ఆయన స్పష్టం చేశారు.
అయితే ఆ సంఘటనలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక ప్యానెల్ అవసరం లేదన్నారు. గత ఏడాది సుమారు 650 ఘటనలు చోటుచేసుకున్నట్లు కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. అయితే గత అయిదేళ్లలో చోటుచేసుకున్న మత ఘర్షణ సంఘటనలపై విచారణ చేపట్టాలని ఓ బీజేపీ నేత డిమాండ్ చేశారు.
కాగా, అసహనం పైన ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. అసహనం అంశంపై ప్రధాని మోడీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో అసహనంపై మోడీ మాట్లాడనున్నారు. పారిస్ సదస్సు నుంచి తిరిగి వస్తున్న ప్రధాని మోడీ రాజ్యసభలో అసహనం అంశంపై మాట్లాడే అవకాశముంది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications