72వేల కి.మీ.యాత్ర: చైతన్యరథంలోనే హరికృష్ణ అంతిమయాత్ర, పరిటాల అడగ్గానే ఒప్పుకున్నారని..
హైదరాబాద్/నల్గొండ: నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర 1983 నాటి చైతన్య రథంపై సాగనుందని తెలుస్తోంది. చైతన్యరథం అంటే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. ఆ తర్వాత హరికృష్ణ పేరు గుర్తుకు వస్తుంది. చైతన్యరథంపై టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ రాష్ట్రమంతటా 1983లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్టీఆర్ చైతన్యరథం నడిపింది హరికృష్ణే. ఈ చైతన్య రథం మీదే హరికృష్ణ అంతిమయాత్ర నిర్వహించే అవకాశముంది. ఇందుకు రామకృష్ణ స్టూడియోలో ఉన్న చైతన్య రథాన్ని సిద్ధం చేస్తున్నారు. 72 వేల కిలోమీటర్ల ఎన్టీఆర్ యాత్రకు హరికృష్ణ సారథిగా ఉన్నారు.

హరికృష్ణ ఇదే వాహనాన్ని 1999లో తన సొంత పార్టీ అన్న టీడీపీ ప్రచారానికి ఉపయోగించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించనుంది.
హరికృష్ణ అడగ్గానే ఒప్పుకున్నారు: పరిటాల సునీత
నందమూరి హరికృష్ణ మృతి పట్ల ఏపీ మంత్రి పరిటాల సునీత సంతాపం వ్యక్తం చేశారు. అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరమన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా పని చేసి హరికృష్ణ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారన్నారు.
Recommended Video

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారని చెప్పారు. అలాగే పార్టీ సమావేశాల్లో తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పేవారన్నారు. పరిటాల రవికి, హరికృష్ణ మధ్య మంచి అనుబంధం ఉండేదన్నారు. శ్రీరాములయ్య సినిమాలో సత్యం క్యారెక్టర్లో మీరే నటించాలని హరికృష్ణను పరిటాల రవి కోరగానే, అడగగానే ఆయన ఒప్పుకొని చేశారని గుర్తు చేసుకున్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications