నిద్రలోనే నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కన్నుమూత
హైదరాబాద్: మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టా రెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన నిద్రలోనే తుది శ్వాస విడిచారని చెబుతున్నారు.
హైదరాబాదులోని ఎస్సార్ నగర్లో గుండెపోటుతో ఆయన నిద్రలోనే మృతి చెందారు. ప్రస్తుతం ఆయన పిఏసి చైర్మన్గా ఉన్నారు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున నారాయణ ఖేడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1989, 1999, 2009, 2014లలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మెదక్ జిల్లా గొప్ప నేతను కోల్పోయిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కిష్టా రెడ్డి మృతి తెలిసి తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
కిష్టా రెడ్డి వయస్సు 57. ఆయన దివంగత నేత బాగారెడ్డి ద్వారా రాజకీయాల్లో పట్టు సాధఇంచారు. 1977లో పంచగామ సర్పంచిగా పని చేశారు. 1982లో నారాయణఖేడ్ సమితి అధ్యక్షుడిగా పని చేశారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో టిటిడి బోర్డు సభ్యుడిగా ఉన్నారు. 1994లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications