మెట్రోను అద్భుతంగా తీర్చిదిద్దుతాం: ఎన్వీఎస్
హైదరాబాద్: నగర అభివృద్ధిలో మెట్రో ఎంతో కీలకమైందని మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన మీట్దిప్రెస్లో ఆయన మాట్లాడుతూ.. పీపీపీ పద్దతిలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో అని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు ఇంజినీరింగ్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని వెల్లడించారు.
బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల సమీపంలోనే మెట్రో స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, అనుకున్న గడువులోపు మెట్రో ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
స్థల సేకరణ కోసం జీహెచ్ఎంసీకి ఇప్పటి వరకు రూ.620 కోట్ల నిధులు ఇచ్చామని, మరో రూ.200 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు.

మెట్రో విస్తరణకు ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. మియాపూర్ - పటాన్చెరు, ఫలక్నుమా - శంషాబాద్ ఎయిర్పోర్టు, తార్నాక - ఈసీఐఎల్ వరకు మెట్రో విస్తరణకు ప్రణాళికలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
నాగోల్ - మెట్టుగూడ మధ్య 8 కిలోమీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయన్నారు. ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నందునే నాగోల్ - మెట్టుగూడ మధ్య సర్వీసులు ప్రారంభించలేదని ఆయన అన్నారు. మెట్రో ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 269 ఎకరాల భూమి సేకరించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి వివరించారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications