అశ్లీల నృత్యాలు: యువతీయువకుల అరెస్ట్
రంగారెడ్డి: జిల్లాలోని మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామ సమీపంలోని ఓ ఫాంహౌజ్పై పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న ఏడుగురు యువకులు, ఇద్దరు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని డబీల్పురవాసి ఇమ్రాన్ ఖురేష్కు చెందిన ఈ ఫాంహౌజ్లో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు.
ఈ దాడుల్లో సంతోష్ నగర్కు చెందిన ఇబ్రహీం, డబీల్పురకు చెందిన మీర్ ఖాసీం, ఎండీ రషీద్ అలీ,సయ్యద్ మోదీషా, ఎండీ హారీఫ్, చంపాపేటకు చెందిన ఎండీ జహీర్, ఇసాక్లతో పాటు యువతులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు
ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం చిన్నబండతండాలో ముగ్గు రు పిల్లలతో కలిసి తల్లి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తండాకు చెందిన ఇస్లావత్ శ్రీను, లక్ష్మి (28)లకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికిపద్మ (9), ప్రేంకుమార్ (5), కార్తీక్ (4) సంతానం.
శ్రీను బతుకుదెరువు కోసం రెండేండ్ల కిందట దుబాయ్ వెళ్లాడు. అక్కడ సరిగా పనిదొరక్క డబ్బు పంపించకపోవడం, అప్పు తీర్చేదారి లేక, పిల్లల పోషణ భారం కావడంతో పిల్లలతో కలిసి సొంతపొలంలోని బావిలోకి దూకి లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది.