తెలంగాణలో 60 లక్షల ఓట్లు ఔట్..? ఆ పార్టీకి కొత్త టెన్షన్..!!

తెలంగాణలో సర్ పక్రియ ముగుస్తున్న వేళ కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. 73 లక్షల 95 వేల 954 ఓట్లు తొలంగించినట్లు తెలుస్తోంది. ఈ రోజు (సోమవారం)తో సర్ ప్రక్రియ ముగియనుంది. హైదరాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోనే దాదాపు 43 లక్షల వరకు ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఓట్ల తొలిగింపు విధానం పైనా ఎన్నికల సంఘం స్పష్టత ఇస్తోంది. ఓటర్ల అభిప్రాయం తెలుసుకున్న తరువాతనే నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఓట్ల తొలిగింపు పొలిటికల్ పార్టీల్లో కొత్త టెన్షన్ కు కారణమవుతోంది.

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించకపోవడంతో సుమారు 74 లక్షల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇందులో ఒక్క హైదరాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోనే దాదాపు 43 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తి అయింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,38,26,448 ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదైంది. డిజిటలైజేషన్‌లో హైదరాబాద్ 58.58 శాతంతో చివరి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మేడ్చల్ - మల్కాజిగిరి 63.82 శాతం, రంగారెడ్డి 64.91 శాతం రికార్డైంది. అత్యధిక డిజిటలైజేషన్‌‌తో యాదాద్రి భువనగిరి 94.30 తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మెదక్ 90.54 శాతం, సూర్యాపేట 90.43 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయింది. దాదాపు 40లక్షల మంది ఓటర్ల జాబితాల్లోని చిరునామాల్లో అందుబాటులో లేరని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. SIRలో తదుపరి ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు.

 TTD గోల్డెన్ ఛాన్స్, ఒకే రోజు ఒకే టికెట్‌తో రెండు సార్లు శ్రీవారి ప్రత్యేక దర్శనం- ఇలా చేయండి..!!
TTD గోల్డెన్ ఛాన్స్, ఒకే రోజు ఒకే టికెట్‌తో రెండు సార్లు శ్రీవారి ప్రత్యేక దర్శనం- ఇలా చేయండి..!!
over-75-lakh-electors-yet-to-submit-enumeration-forms-in-telangana-hyderabad-tops-list-details-he

ఈ నెల 17న ముసాయిదా ప్రకటన

ముసాయిదా విడుదల తరువాత పేరు జాబితాలో లేకపోతే అర్హులైన ఓటర్లు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. కాబట్టి ప్రస్తుతం 74 లక్షల ఓట్లు గల్లంతయ్యాయనే నిర్ధారణ సరి కాదంటున్నారు. ముసాయిదా విడుదల తరువాత జాబితాల లోని వారికి నోటీసులు జారీ చేయనున్నారు. అదే విధంగా పేరు లేకపోయినా, కొత్తగా నమెదు చేసుకోవాలను కొనే వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పిస్తోంది. వారు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు. కాగా.. ఇప్పుడు ఈ ఓట్ల తొలిగింపు వ్యవహారం పైన రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. సర్ పక్రియ తొలి నుంచి పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రతీ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రక్రియను పరిశీలించాలని క్షేత్ర స్థాయి నేతలకు సూచించాయి. కాగా.. 17న ప్రకటించే ముసాయిదా జాబితా తరువాత ఈ వ్యవహారంలో కీలక పరిణామలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+