బాబుకు మ్యాంగో ఫ్రెండ్: రేవంత్ కేసులో న్యాయనిర్ణేతగా పవన్ కళ్యాణ్!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మ్యాంగో ప్రేమ కనబరుస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్కు చెందిన దినపత్రిక నమస్తే తెలంగాణ వ్యాఖ్యానించింది.
ఎవరు తప్పుచేసినా ప్రశ్నించేందుకు తానుంటానని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఆ సంగతే విస్మరించారని, గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమికి అనుకూలంగా రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రచారం చేసిన అతను, తప్పుచేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తానని ప్రగల్బాలు పలికారని పేర్కొంది.

కానీ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తీరును తెలుగు ప్రజలు తప్పుబడుతున్నా పవన్ కల్యాణ్ మౌనంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైందని, చంద్రబాబుకు తన ఫామ్హౌస్లో పండిన పండ్లు పంపారని రాసింది.
'చంద్రబాబు గారు... మీకు శుభాకాంక్షలు. తియ్యటి మామిడి పండ్లతో ఈ వేసవి మరింత గుర్తుండుపోయేలా గడవాలని కోరుకుంటూ.. పవన్ కళ్యాణ్' అని సొంత లేఖ కూడా దానికి జత చేశారని రాసింది. కాగా, పవన్ ప్రశ్నించక పోవడం పైన కాంగ్రెస్ నేత వి హనుమంత రావు, దర్శకుడు రాంగోపాల్ వర్మ తదితరులు కూడా నిలదీసిన విషయం తెలిసిందే.
కాగా, ఓటుకు నోటు కేసులో న్యాయనిర్ణేతగా పవన్ కళ్యాణ్ను పెట్టాలని వీహెచ్ డిమాండ్ చేయడం గమనార్హం. ఏపీ సీఎం చేసింది తప్పో ఒప్పో పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు.
-
ఆ నిధులన్నీ వారికే: సీఎం రేవంత్ కీలక నిర్ణయం -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!!












Click it and Unblock the Notifications