వ్యభిచార గృహాలపై దాడి: హోంకి బంగ్లా యువతులు
హైదరాబాద్: నగరంలోని మీర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు ఆదివారం వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. ఎల్బీనగర్లోని నువ్వులబండ నగర్లో శ్రావణ్కుమార్ అనే వ్యక్తి అద్దె ఇంట్లో వ్యభిచార దందా నడిపిస్తున్నాడు. విదేశీ అమ్మాయిలంటూ విటులకు సెల్ఫోన్, వాట్సాప్ల ద్వారా యువతుల వివరాలు, ఫొటోలు పంపిస్తున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులసు సోదాలు చేయడంతో బండారం బయటపడింది. బాధిత మహిళలు బంగ్లాదేశ్కు చెందిన వారుగా గుర్తించిన రెస్క్యూ హోంకు పంపించారు. వీరి వద్ద సరైన పత్రాలు లేవని గుర్తించారు. తదుపరి దర్యాప్తు కోసం నిర్వాహకుడు శ్రావణ్కుమార్ను ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరో ఘటనలో మీర్పేట్ రాఘవేంద్రనగర్లో ఓ మహిళ అమాయక యువతులకు ఉద్యోగాల పేరిట గాలం వేస్తూ వ్యభిచారం చేయిస్తోంది. ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు విచారణలో బయటపడింది. నిర్వాహకురాలిని అరెస్టు చేసిన పోలీసులు ఇద్దరు యువతులకు విముక్తి కల్పించి రెస్క్యూ హోంకు పంపించారు. వీరి వద్ద నుంచి సెల్ఫోన్లు, ద్విచక్రవాహనాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
పాల్వంచలో భారీగా గంజాయి పట్టివేత
ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో భారీగా గంజాయిని అధికారులు పట్టుకున్నారు. చత్తీగఢ్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా 200 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్న అధికారులు వాహనాన్ని సీజ్ చేశారు.