హైద్రాబాద్లో మతమార్పిడులు: చిన్న పిల్లలే లక్ష్యం, 9 మంది అరెస్ట్
పేదరికాన్ని ఆసరాగా చేసుకొని మత మార్పిడులకు పాల్పడుతున్న ఓ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమం పేరుతో చిన్న పిల్లలను మత మార్పిడులకు పాల్పడుతున్నారని పోలీసులు ప్రకటించారు.
హైదరాబాద్: పేదరికాన్ని ఆసరాగా చేసుకొని మత మార్పిడులకు పాల్పడుతున్న ఓ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమం పేరుతో చిన్న పిల్లలను మత మార్పిడులకు పాల్పడుతున్నారని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనకు పాల్పడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఆశ్రమంలో ఉంటున్న 17 మంది చిన్న పిల్లలను పోలీసులు రక్షించి స్టేట్ హోంకు తరలించారు.
సత్యనారాయణ అలియాస్ సిద్దిఖీ పేద పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించే ఉద్దేశ్యంతో ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం చేసుకొంటారని పోలీసులు చెప్పారు. ఆశ్రమంలో చేరిన పిల్లలను బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారని గుర్తించినట్టు రాచకొడం సిపి మహేష్ భగవత్ చెప్పారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని భద్రాచలం, సూర్యాపేట, రాజమండ్రి తదితర ప్రాంతాల నుండి పిల్లలను ఆశ్రమంలో చేర్చారని సిపి చెప్పారు. వీరంతా గిరిజనులేనని ఆయన చెప్పారు
ఆశ్రమ నిర్వాహకుడు తొలుత హిందువేనని చెప్పారు. అయితే కారణాలేమిటో తెలియదు కానీ, సత్యనారాయణ ముస్లిం మతాన్ని స్వీకరించాడని పోలీసులు చెప్పారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆశ్రమాలను సత్యనారాయణ అలియాస్ సిద్దిఖీ నిర్వహించారు.
తాజాగా మౌలాలి సమీపంలో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఎన్ఐఏ నుండి వచ్చిన సమాచారం మేరకు రాచకొండ పోలీసులు ఈ ఆశ్రమం మీద దాడి చేశారు. ఈ ఆశ్రమంలో ఉన్న 17 మంది పిల్లలను స్టేట్హోంకు తరలించారు. పోలీసులు రక్షించిన వారిలో 3 అమ్మాయిలు కూడ ఉన్నారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications