పురానాపూల్ రీపోలింగ్ ఫలితం: ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 గంటలకు వాయిదా
హైదరాబాద్: కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్లో రీపోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పురానాపూల్ డివిజన్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీచేసింది.

దీంతో పురానాపూల్ డివిజన్లోని 36 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ఏర్పాట్లు చేయాలని బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రేటర్ ఓట్ల లెక్కింపు (కౌంటింగ్)ను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
నిజానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయమే ప్రారంభం కావాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఎన్నికల సంఘం ఈ మేరకు స్పష్టంగా ప్రకటించింది. అయితే మంగళవారం జరిగిన గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పురానాపూల్లో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే.

మీర్చౌక్ పోలీస్స్టేషన్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, షబ్బీర్ అలీపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎన్నికల కమిషనర్, గవర్నర్లకు ఫిర్యాదు చేసింది. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, పురానాపూల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దీనిపై సమీక్షించిన తెలంగాణ ఎన్నికల సంఘం పురానాపూల్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. రీపోలింగ్ పూర్తయిన తర్వాత అంటే శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి గ్రేటర్ ఓట్ల లెక్కింపు (కౌంటింగ్)ను ప్రారంభించనున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications