రేవంత్ రాకపై శశిధర్ ఇలా: చాలా మంది వస్తారంటూ కుంతియా కీలక వ్యాఖ్యలు
టీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతమవుతోందని అన్నారు.
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ టీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతమవుతోందని అన్నారు. పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.

క్యూలో చాలా మంది నేతలు
అంతేగాక, ఇతర పార్టీల నుంచి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని కుంతియా అన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడటం అసాధ్యమని అన్నారు. అమిత్ షా వల్లే తెలంగాణలో బీజేపీ బలహీనపడిందని అన్నారు.

2019లో మాదే అధికారం..
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని కుంతియా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో బలమైన ప్రతిపక్షం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు లేవని అన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీదేని కుంతియా అన్నారు.
Recommended Video


ఖాయంగానే రేవంత్..
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. రెండ్రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన రేవంత్ కొందరు కాంగ్రెస్ ముఖ్యనేతలతో పాటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. అంతేగాక, ఏపీ టీడీపీ నేతలపై బుధవారం సాయంత్రం తీవ్ర విమర్శలు చేయంతో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరుతున్నట్లు ఖాయమైనట్లేని తెలుస్తోంది. అయితే ఎప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

రేవంత్ రాకపై శశిధర్ రెడ్డి
ఇదిఇలావుంటే.. రేవంత్ రాకను అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు వ్యతిరేకిస్తుండగా మరికొందరు నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు. తాజాగా, ఇదే విషయమై కాంగ్రెస్ నేత మర్రి శశిదర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ పార్టీలోకి వస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. రేవంత్ను పార్టీలో చేర్చుకోవడంపై అధిష్టానం నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
పార్టీలోకి ఎవరొచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.ఓటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు జరిగాయని, ఇంటింటి ఓటర్ల సర్వే సక్రమంగా చేయలేదన్నారు. మరోసారి పకడ్బందీగా సర్వే నిర్వహించాలని శశిధర్ డిమాండ్ చేశారు.
-
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications