అంతొద్దు: రేవంత్ రెడ్డి, కెసిఆర్తో టిడిపి ఎమ్మెల్యే మాగంటి సీక్రెట్ భేటీ?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్ర పర్యటన పైన గొప్పలు చెప్పుకుంటున్నారని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఎద్దేవా చేశారు. తుమ్మిడిహెట్టి ఎత్తు 148 మీటర్లు నిర్మించుకోవచ్చునని మహారాష్ట్ర గతంలోనే చెప్పిందన్నారు.
ఇప్పుడు కూడా 148 మీటర్లకే మహారాష్ట్ర అంగీకరించిందని చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తు నిర్మిస్తేనే ఉపయోగం ఉంటుందన్నారు. దీనిపై తెలంగాణ సీఎం కెసిఆర్ సాధించికు వచ్చింది ఏమీ లేదన్నారు. గోదావరి జలాలను హైదరాబాద్ తరలించాలనేది గతంలో టిడిపి నిర్ణయమే అన్నారు.
మాగంటి.. కెసిఆర్తో సీక్రెట్గా భేటీ అయ్యారా?

టిడిపి దివంగత నేత, ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన మాధవరెడ్డి వర్ధంతి సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, గ్రేటర్ టిడిపి అధ్యక్షులు మాగంటి గోపినాథ్ నిన్న హైదరాబాదులోనే ఉన్నారు. పైగా అధినేత జగన్ ఆహ్వానించారు.
అయినప్పటికీ మాధవరెడ్డి వర్ధంతికి డుమ్మా కొట్టారు. ఈ కార్యక్రమానికి హాజరు కాని మాగంటి.. సోమవారం ఉదయమే గుట్టుచప్పుడు కాకుండా కేసీఆర్తో భేటీ అయ్యారని తెలుస్తోంది. ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన మాగంటి కేసీఆర్తో భేటీ అయ్యారని తెలుస్తోంది.
ఈ విషయం సోమవారం బయటకు రాలేదు. కానీ మంగళవారం దీనిపై వార్తలు వస్తున్నాయి. మాగంటి గోపినాథ్ను కలిసిన తర్వాతే కేసీఆర్ ముంబై వెళ్లారని తెలుస్తోంది. కేసీఆర్తో భేటీ నేపథ్యంలో మాగంటి కూడా టిడిపికి చేయిచ్చి కారు ఎక్కడం ఖాయమంటున్నారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
గోల్కొండ తారామతి రిసార్ట్ లో డ్రగ్స్ పార్టీ, బాలీవుడ్ నటులు, ఈగల్ టీమ్ షాకింగ్ రైడ్! -
బాసరలో వీఐపీ వాహనాలకు సైతం నో ఎంట్రీ -
అదిరిపోయే శుభవార్త.. త్వరలో తెలంగాణాలో ఐదు కొత్త ప్రతిష్టాత్మక పథకాలు -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications