లారీ ఎక్కి వెళ్లి కృష్ణ సినిమాలు చూసేవాడిని: సీఎం రేవంత్
కోకాపేట్ లో అల్లు సినిమాస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత స్క్రీన్లను పరిశీలించారు. అంతకుముందు అల్లు రామలింగయ్య విగ్రహానికి సీఎం నివాళులు అర్పించారు. ఈ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, టీఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అల్లు అర్జున్ అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు.
"దేశంలో సినిమాకు గొప్ప పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు కుటుంబాన్ని అభినందిస్తున్నా. నేను సినిమా అభిమానిని. సినిమా సాంకేతికంగా వేగంగా ముందుకు వెళుతుంది. ప్రేక్షకులని కట్టిపడేసే సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి. బాహుబలి, కల్కి, అరుంధతి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక విలువలతో వచ్చాయి. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్ రావు తెలుగు సినిమాను హైదరాబాద్ తీసుకొచ్చారు" అని అన్నారు.
"కృష్ణ సినిమాలో అడ్వెంచర్స్ చేసారు. నేను కృష్ణ అభిమానిని. లారీ ఎక్కి వనపర్తికి వెళ్లి నేను సినిమాలు చేసే వాడిని. కృష్ణ ఏడాదికి 15 సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఐదారేళ్లుకు ఒక సినిమా చేస్తున్నాను. సినిమా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. సినిమాను పరిశ్రమగా గుర్తించి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. IT, ఫార్మాతో పాటు సినిమా పరిశ్రమ గొప్ప స్థాయికి తీసుకు వెళ్తాం. తెలుగు సినిమాకు కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలివుడ్ పోటీ కాదు. హాలీవుడ్ సినిమాలు ఇక్కడ చిత్రీకరించాలి" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కృష్ణానగర్ నుంచి గొప్ప సినిమాలు తీసే అనేక మంది సాంకేతిక నిపుణులు, కళాకారులు వస్తున్నారు. సినిమా పరిశ్రమ పెరగడానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. మన సినిమాలు హాలీవుడ్ కు వెళ్లాలి. భాష అడ్డంకి కాదు ఇప్పుడు. టాలెంట్ మాత్రమే ఇప్పుడు కనిపిస్తుంది.. అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications