Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేటి నుంచి తెలంగాణలో అమలు కానున్న ఎస్సీ వర్గీకరణ.. జీవో తొలి కాపీ ఎవరికంటే ?

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు, నిబంధనలు జారీ చేయనుంది. అంతే కాకుండా ఈరోజును వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. ఉత్తర్వుల తొలికాపీని సీఎం రేవంత్‌రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో నిర్ణయించింది.

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దశాబ్దాల నాటి డిమాండ్‌ నెరవేర్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణలో క్రీమీలేయర్‌ ప్రవేశపెట్టాలన్న కమిషన్‌ సిఫార్సును ప్రభుత్వం తిరస్కరించిందని ఉత్తమ్‌ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పుకొచ్చారు.

sc-classification-to-be-implemented-in-telangana-from-today

గతేడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు తరువాత అక్టోబరులో ప్రభుత్వం జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ నియమించింది. జనాభా, అక్షరాస్యత, ఉన్నత విద్య ప్రవేశాలు, ఉపాధి సహా పలు అంశాలపై కమిషన్‌ లోతైన విశ్లేషణ నిర్వహించి 199 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. బహిరంగ విచారణలు, ప్రజల నుంచి వచ్చిన 4,750 విజ్ఞప్తులతో పాటు కార్యాలయానికి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్లో వచ్చిన 8,681 వినతులను కమిషన్ పరిశీలించింది. మొత్తం 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించింది.

ఇక ఈ వర్గీకరణ విధానంలో గ్రూప్‌-1లో అత్యంత వెనుకబడిన కులాలు.. గ్రూప్‌-2లో మధ్యస్థ స్థితిలో ఉన్న లబ్ధిపొందిన కులాలు.. గ్రూప్‌-3లో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు ఉండనున్నాయి. ఈ తరహా వర్గీకరణతో ఎస్సీ ఉపకులాల మధ్య సమన్యాయం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఇందుకు సంబంధించి ఉపసంఘ సమావేశం ఆదివారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించారు. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధ్యక్షతన మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఏకసభ్య కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్‌, డైరెక్టర్‌ క్షితిజ్‌ సహా పలువురు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+