చార్మిపై కానిస్టేబుల్ చేయి: నటి ఫిర్యాదు చేయలేదన్న సిట్
డ్రగ్స్ కేసులో బుధవారం విచారణ ఎదుర్కొన్న సినీ నటి చార్మీ ఓ కానిస్టేబుల్పై ఫిర్యాదు చేసినట్లుగా వచ్చిన వార్తలు వాస్తవం కాదని సిట్ అధికారులు గురువారం వెల్లడించారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో బుధవారం విచారణ ఎదుర్కొన్న సినీ నటి చార్మీ ఓ కానిస్టేబుల్పై ఫిర్యాదు చేసినట్లుగా వచ్చిన వార్తలు వాస్తవం కాదని సిట్ అధికారులు గురువారం వెల్లడించారు.
చదవండి: బయటకొచ్చాక మరింత అందం, సిట్నే విచారించినట్లుగా: చార్మీపై వర్మ, వెటకారం
నిన్న ఛార్మి విచారణ సందర్భంగా ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అత్యుత్సాహం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
ఈ కేసులో విచారణకు ఛార్మి హాజరు నేపథ్యంలో అధికారులు బందోబస్తు కోసం మహిళా సిబ్బందిని మోహరించారు. అయితే, ఆమె అక్కడకు చేరుకోగానే కొంత తోపులాట జరిగింది.
చదవండి: సంచలన మలుపు: ఒకే అపార్టుమెంట్లో చార్మీ-కమింగా? మరిన్ని షాకింగ్ విషయాలు
మహిళా సిబ్బంది ఉన్నప్పటికీ పురుష కానిస్టేబుల్ ఒకరు ముందుకొచ్చి తాకడంతో ఛార్మి కాస్త ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.
అయితే, సదరు కానిస్టేబుల్పై ఛార్మి ఫిర్యాదు చేశారంటూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ముమైత్ విచారణ అనంతరం ఓ స్పష్టత ఇచ్చారు. కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించారంటూ ఛార్మి ఫిర్యాదు చేయలేన్నారు. చార్మీతో అనుచితంగా ప్రవర్తించలేదన్నారు.