హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్ వారికి ముఖ్య గమనిక
హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో రైల్వేకు సంబంధించిన నిర్వహణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంతో 20 రైళ్లను వారంరోజులపాటు అధికారులు రద్దుచేశారు. 18 రైళ్లను ఈనల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, రెండు రైళ్లను 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రద్దుచేశారు.
రద్దైన రైళ్ల వివరాలు
కాజీపేట-డోర్నకల్
డోర్నకల్-కాజీపేట
డోర్నకల్-విజయవాడ
విజయవాడ-డోర్నకల్
భద్రాచలం రోడ్డ-విజయవాడ
విజయవాడ-భద్రాచలం రోడ్
కాజీపేట-సిర్పూర్ టౌన్
బలార్షా-కాజీపేట

సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్
సికింద్రాబాద్-వరంగల్
వరంగల్-సికింద్రాబాద్
సిర్పూర్ టౌన్-సికింద్రాబాద్
సికింద్రాబాద్-సిర్పూర్ టౌన్
కరీంనగర్-నిజామాబాద్
నిజామాబాద్-కరీంనగర్
కాజీపేట-బలార్షా
బలార్షా-కాజీపేట
కాచిగూడ-నిజామాబాద్
నిజామాబాద్-కాచిగూడ
అలాగే 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో 22 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దుచేశారు.
ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తోన్న తరుణంలో ప్రయాణికుల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్న భారతీయ రైల్వే కాలక్రమంలో సాంకేతికను జోడించుకుంటూ వస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులను ఆకట్టుకోవడానికి, దేశంలోని ప్రధాన నగరాల మధ్య తక్కువ సమయం ప్రయాణించేందుకు వందే భారత్ పేరుతో రైళ్లను తీసుకొచ్చింది. ప్రస్తుత దేశవ్యాప్తంగా 25 మార్గాల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లు ఈ నెలాఖరులోగా మరో 5 మార్గాల్లో అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications