తలసాని ఇష్యూ నా పరిధిలో లేదు, తెలంగాణకు ఇంచార్జీనే: భన్వర్లాల్
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారం తన పరిధిలో లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ నసీం జైదీని భన్వర్లాల్ మంగళవారం కలిశారు.
ఈ సందర్భంగా భన్వర్లాల్ మీడియాతో మాట్లాడారు. తలసాని రాజీనామాపై ప్రశ్నించగా ఆ వ్యవహారం తన పరిధిలో లేదని, టిఆర్ఎస్ ప్రభుత్వానికీ తనకూ ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తాను ఏపీ క్యాడర్కు చెందిన వాడినని, తెలంగాణకు ఇంచార్జ్గా మాత్రమే ఉన్నానని భన్వర్లాల్ తెలిపారు.

జీహెచ్ఎంసీ పరిధిలో ఆరుశాతం ఓట్లను తొలగించారని, నిజామాబాద్ జిల్లాలో 26 శాతం ఓట్లను తొలగించారని, తెలంగాణలోని చాలా చోట్ల ఓట్ల తొలగింపు జరిగిందని చెప్పారు. ఓట్ల తొలగింపుపై విచారణ జరిగిపి చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రకటన వస్తే తప్పకుండా తెలియజేస్తానని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
కాగా, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గంలో చేరారు. ఈ వ్యవహారంపై తీవ్ర వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications