తెలంగాణలో మరో ఎంపీటీసీ గెలిచిన టిడిపి, టిఆర్ఎస్ మూడో స్థానం
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరో ఎంపీటీసీ సీటును కైవసం చేసుకుంది. ఓటుకు నోటు కేసు అనంతరం తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడం ఖాయమని కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు చెబుతున్న విషయం తెలిసిందే.
అయితే, టిడిపి స్థానిక ఎన్నికల్లో ఇటీవల ఎంపీటీసీ, సర్పంచ్లు పలుచోట్ల గెలుచుకుంది. తాజాగా భాగ్యనగరంలోని రాజేంద్ర నగర్ మండలంలోను ఎంపీటీసీని గెలిచుకుంది. వట్టినాగులపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వెంకటేష్ 378 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

మరో విషయమేమంటే వట్టినాగులపల్లిలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలవగా, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మూడో స్థానానికి పరిమితమైంది.
రాజీనామా ఆమోదించుకో: వెంకటేష్ గౌడ్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ధైర్యం ఉంటే తన శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామా ఆమోదించుకోవాలని టిడిపి నేతలు సవాల్ చేస్తున్నారు. సనత్నగర్ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ కూన వెంకటేశ్ గౌడ్ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ... తలసాని రాజీనామా ఆమోదింప చేసుకోవాలన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications