Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అక్టోబర్ 18న తెలంగాణా బంద్!

తెలంగాణ రాష్ట్రంలో రేపు 14వ తేదీన రాష్ట్ర బంద్ ను నిర్వహిస్తామని, బీసీ హక్కుల సాధన కోసం వివిధ బీసీ సంఘాలు, బిసి రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 14వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్ ను వాయిదా వేసినట్టు బీసీ జేఏసీ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. తెలంగాణరాష్ట్ర బంద్ ను 18వ తేదీన చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం కోసం ఆందోళన ఉధృతం
తెలంగాణ రాష్ట్రంలో బిసి హక్కుల సాధన కోసం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం కోసం చేపట్టిన ఈ ఆందోళన, బలమైన ఉద్యమంగా కేంద్ర ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపిస్తుందని, తద్వారా రిజర్వేషన్ల విషయంలో సవరణలు చేయవలసిన అవసరం ఉంటుందని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్ ను సక్సెస్ చేస్తే బీసీల ఐక్యత కేంద్రానికి తెలుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telangana bandh on October 18th bc jac announced the latest date for state bandh

Take a Poll

బీసీలు పోరాటం చేయాల్సి వస్తూనే ఉందన్న ఆర్ కృష్ణయ్య
బంద్ కు పిలుపునివ్వడం ద్వారా ప్రభుత్వం మరియు అధికారిక వ్యవస్థ దృష్టిని ఆకర్షించాలని, బీసీల యొక్క ఐక్యత ఏమిటో చాటి చెప్పాలని భావిస్తున్నామని ఆయన అన్నారు.
ఇప్పటివరకు దేశానికి స్వాతంత్రం వచ్చి 76సంవత్సరాలు గడిచినప్పటికీ బీసీలకు దక్కాల్సిన న్యాయం దక్కలేదని, ఇంకా బీసీలు పోరాటం చేయాల్సి వస్తూనే ఉందని ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు వారికి పూర్తిగా దక్కటం లేదని బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలను విస్మరించడం ఏ ప్రభుత్వానికి మంచిది కాదు
బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు లేకపోవడమే ప్రధాన సమస్య అని ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ రిజర్వేషన్లు తక్కువగా ఉండడం, బీసీలను విస్మరించడం ఏ ప్రభుత్వానికి మంచిది కాదని, అందుకే ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

హైకోర్టు స్టే ఇవ్వడం బీసీలను మరింత అవమానించడమే
దేశంలో విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవులలో బీసీల వాటా తక్కువగా ఉందని ముఖ్యంగా స్థానిక సంస్థలు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేక బీసీలు అణగదొక్కబడుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 42 శాతం రిజర్వేషన్లు అమలుకు సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వడం బీసీలను మరింత అవమానించడమే అని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ల అంశం పైన హైకోర్టు స్టే ఇవ్వడం న్యాయం కాదని ఆయన అన్నారు.

చట్టసభల్లో బిల్లు పెట్టేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం
ఈ అవమానాన్ని తమ భరించలేకపోతున్నామని అందుకే చట్టసభల్లో బిల్లు పెట్టేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తేల్చి చెప్పారు. బీసీ జేఏసీ పోరాటాన్ని ఉధృతం చేయడం ద్వారా, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకువెళతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బీసీల కోసం చట్టపరమైన చర్యల కోసం ఒత్తిడి తీసుకురావాలని బీసీ జేఏసీ నేతలు భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+