రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ: కీలక అంశాలు లేకుండానే
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. శనివారం జరగాల్సిన సమావేశం ఈసీ అనుమతి లభించక వాయిదా పడింది. ఆదివారం ఈసీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అయితే అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని షరతులు విధిస్తూ కేబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జూన్ 4వ తేదీ లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే ఏజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4వ తేదీ వరకు పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి హాజరుకావద్దని ఆదేశించింది.

కాగా, రైతు రుణమాఫీ, ఏపీ-తెలంగాణ మధ్య విభజన అంశాలతో పాటు ధాన్యం కొనుగోళ్లు,ఖరీఫ్ పంటల ప్రణాళిక, ఇంకా రైతులకు సంబంధించిన అనేక అంశాలు, పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభానికి సన్నాహకాలపైన శనివారం కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.
అంతేగాక, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణపై కూడా సీఎం రేవంత్ చర్చించాలని భావించారు అయితే సార్వత్రిక ఎన్నికల కోడ్, వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో మంత్రిమండలి సమావేశ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీని కోరింది. ఈ క్రమంలో పలు షరతులతో విధించిన ఈసీ.. కేబినెట్ భేటీకి అనుమతిచ్చింది.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications