Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎట్టకేలకు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు, ప్రభుత్వం తాజా నిర్ణయం..!!

రైతులకు కీలక అప్డేట్. కొంత కాలంగా వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదల పైన స్పష్టత వచ్చింది. సంక్రాంతి సమయంలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తారని తొలుత భావించారు. అయితే, అమలు కాలేదు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్దం అవుతోంది. కాగా, ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా నిధులు విడుదల పైన తుది కసరత్తు చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ముహూర్తం దాదాపు ఫిక్స్ చేసారు. విడతల వారీగా నిధుల చెల్లింపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

రైతు భరోసా నిధుల విడుదల పైన ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రైతులకు సంక్రాంతి సమయం లోనే రైతు భరోసా నిధులు జమ చేస్తారని తొలుత భావించా రు. అయితే, ఇప్పుడు కొత్త అప్డేట్ అందుతోంది. అదే సమయంలో రైతు భరోసా అమలు.. అర్హత పైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పథకం అందుకుంటున్న లబ్దిదారుల్లో తాజా అర్హతల మేర కోత విధించారు. జనవరి 26 నుంచి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Telangana govt almost finalised the date for Release of Rythu Bharosa funds

పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగా శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములను గుర్తిస్తోంది. దీనికి సంబంధించిన తుది నివేదిక ప్రభుత్వానికి అందాల్సి ఉంది. దీంతో.. రైతు భరోసా నిధులు సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి స్పష్టత ఇచ్చారు. జనవరి నెలాఖరు లోగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని వెల్లడించారు.

కాగా, పంట భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్ నట్లు తెలుస్తోంది. కేవలం అర్హులకు మాత్రమే రైతు భరోసా అందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా మేడారంలో జరిగిన కేబినెట్ భేటీలోనూ ఈ అంశం పైన చర్చ జరగలేదు. ఈ వారంలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో.. ఈ పథకం గతం నుంచి కొనసాగుతున్న ది కావటంతో కోడ్ వచ్చినా ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.

గత ప్రభుత్వం అన్నీ భూములకు రైతు భరోసా ఇచ్చిందని, తమ ప్రభుత్వం కేవలం రైతులకు మాత్రమే ప్రయో జనం చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు చెబుతున్నారు. వ్యవసాయ యూనివర్సిటీ తో కలిసి శాటిలైట్ సర్వే చేయించి.. ఆ నివేదిక ఆధారంగా పంట సాగు చేస్తున్న భూములను గుర్తించి వారికి మాత్రమే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+