Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ రాష్ట్రంలో 2015లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపు ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఈ న్యాయపోరాటం వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది. 2019లో TGPSC విడుదల చేసిన తుది సెలక్షన్ లిస్ట్‌ను హైకోర్టు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కీలక నిర్ణయానికి ప్రధాన కారణం .. పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలు. 2015 గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన OMR షీట్లు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని పేర్కొంటూ గతంలో కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Telangana Group 2 Selection List Cancelled HC Orders Re-evaluation Over OMR Tampering
ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరుపై తీవ్ర విమర్శలకు దారి తీశాయి. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా TGPSC ఉల్లంఘించిందని జవాబు తీర్పు సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక ప్రభుత్వ నియామక సంస్థ న్యాయస్థానం ఆదేశాలను పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

8 వారాల్లో కొత్త లిస్ట్ ఇవ్వాలని ఆదేశం
దీంతో హైకోర్టు TGPSCకి కఠిన ఆదేశాలు జారీ చేసింది.తక్షణమే రద్దయిన 2019 సెలక్షన్ లిస్ట్‌ను ఉపసంహరించుకోవాలి.వివాదాస్పదమైన OMR షీట్లను నిష్పాక్షికంగా రివాల్యుయేషన్ తిరిగి మూల్యాంకనం చేయాలి.ఈ ప్రక్రియ మొత్తాన్ని 8 వారాల్లో పూర్తి చేసి, కొత్తగా సవరించిన సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేయాలి.

ఈ తీర్పుతో ఒకవైపు ఇప్పటికే ఉద్యోగాలు పొందిన కొందరికి షాక్ తగిలినా, మరోవైపు న్యాయం జరగాలని పోరాడిన ఎంతో మంది అభ్యర్థులకు ఊరట లభించింది. పారదర్శకత, నిష్పాక్షికతతో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగాలనే సందేశాన్ని ఈ తీర్పు బలంగా ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+