గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ రాష్ట్రంలో 2015లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపు ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఈ న్యాయపోరాటం వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది. 2019లో TGPSC విడుదల చేసిన తుది సెలక్షన్ లిస్ట్ను హైకోర్టు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ కీలక నిర్ణయానికి ప్రధాన కారణం .. పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలు. 2015 గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన OMR షీట్లు ట్యాంపరింగ్కు గురయ్యాయని పేర్కొంటూ గతంలో కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

8 వారాల్లో కొత్త లిస్ట్ ఇవ్వాలని ఆదేశం
దీంతో హైకోర్టు TGPSCకి కఠిన ఆదేశాలు జారీ చేసింది.తక్షణమే రద్దయిన 2019 సెలక్షన్ లిస్ట్ను ఉపసంహరించుకోవాలి.వివాదాస్పదమైన OMR షీట్లను నిష్పాక్షికంగా రివాల్యుయేషన్ తిరిగి మూల్యాంకనం చేయాలి.ఈ ప్రక్రియ మొత్తాన్ని 8 వారాల్లో పూర్తి చేసి, కొత్తగా సవరించిన సెలక్షన్ లిస్ట్ను విడుదల చేయాలి.
ఈ తీర్పుతో ఒకవైపు ఇప్పటికే ఉద్యోగాలు పొందిన కొందరికి షాక్ తగిలినా, మరోవైపు న్యాయం జరగాలని పోరాడిన ఎంతో మంది అభ్యర్థులకు ఊరట లభించింది. పారదర్శకత, నిష్పాక్షికతతో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగాలనే సందేశాన్ని ఈ తీర్పు బలంగా ఇచ్చింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications