ఇంటర్ పరీక్షలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్: 25 నుంచి పరీక్షలు ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ పరీక్షలను ఆపలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. అక్టోబర్ 25 నుంచి జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్ కోర్టును కోరారు. ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. అక్టోబర్ 25 నుంచి పరీక్షలు ఉండగా పిటిషన్ వేస్తే ఎలా అని ప్రశ్నించింద.ి చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో తమ పిటిషన్ను తల్లిదండ్రుల సంఘం వెనక్కి తీసుకుంది.

కాగా, ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అక్టోబర్ 25 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. గత సంవత్సరం కరోనాతో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో అందరినీ పరీక్ష లేకుండానే ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేశారు.
ఒకసారి ప్రమోట్ అయిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం సరికాదని, ఇప్పటికే వారంతా ద్వితీయ సంవత్సరం చదువుతున్నందున మళ్లీ మొదటి సంవత్సరం సబ్జెక్టులు చదవడంతో గందరగోళానికి, ఒత్తిడికి గురవుతారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. మిగితా వారిలాగే వారందరినీ పాస్ అయినట్లు ప్రకటించాలని కోరుతూ గురువారం పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్థించడంతో శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హైకోర్టు విచారణ చేపట్టింది.
ఇప్పటికే ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతేగాక, విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేసిన సందర్భంలోనే పరిస్థితిని బట్టి మళ్లీ పరీక్ష ఉంటుందని చెప్పామని తెలిపారు. గతంలో ఈ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు కూడా రాయలేదని, ఇప్పుడు ఈ పరీక్షలు కూడా రాయకపోతే భవిష్యత్తులో ఏదైనా పరిస్థితులు ఎదురై ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా రాయకుంటే వారిని ఎలా ఎవాల్యుయేట్ చేయాలన్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Recommended Video
ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ కేసులో వాదోపవాదలను పక్కనపెట్టి.. అసలు చివరి నిమిషంలో పిటిషన్ వేస్తే ఎలా విచారణ జరుపుతామంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని పిటిషనర్కు సూచించింది. దీంతో తల్లిదండ్రుల సంఘం తమ పిటిషన్ ఉపసంహరించుకుంది. పరీక్షలకు సహకరిస్తామని పేర్కొంది. దీంతో అక్టోబర్ 25 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు యధావిధిగా జరగనున్నాయి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications