కర్ణాటక పరిణామాలు బాధ కల్గిస్తున్నాయి: కోదండరామ్
బెంగుళూరు: కన్నడనాట జరుగుతున్న రాజకీయాలు బాధకలిగిస్తున్నాయని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకులు ప్రోఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు.
కర్ణాటకలోని రాజకీయ సంక్షోభంపై తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు కోదండరామ్ వ్యాఖ్యానించారు
శనివారం నాడు ప్రోఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. దేశంలో జరుగుతున్న గలీజు రాజకీయాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో సంస్కరణలు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం టీజేఎస్ పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాజకీయ ప్రక్షాళన కోసమే తెలంగాణ జనసమితి ఆవిర్భవించిందన్నారు. కౌలు రైతులకు పెట్టుబడికై భూరికార్డుల్లోని అక్రమాలను నిరసిస్తూ ఈ నెలాఖరులో ఖమ్మం నుంచి సడక్ బంద్ చేపట్టనున్నట్టు కోదండరామ్ ప్రకటించారు.

కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్, జెడి(ఎస్) లు యడ్యూరప్పకు సీఎం పదవిని కట్టబెట్టడాన్ని నిరసిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో శనివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు విశ్వాస పరీక్ష జరగనుంది.
దేశ వ్యాప్తంగా ఈ విశ్వాస పరీక్షపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజకీయాల్లో మార్పును కోరుకొంటున్న తెలంగాణ జనసమితి ఈ తరహ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు కరీంనగర్ లో ఆ పార్టీ వ్యవస్థాపకులు కోదండరామ్ కన్నడ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications