దుబాయ్లో తెలంగాణ యువకుడి హత్య: మరణ వార్త విని భార్య షాక్!
ప్రతీ నెలా ఇంటికి డబ్బు పంపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
దుబాయ్: జగిత్యాల మండలం సోమన్ పల్లి గ్రామానికి చెందిన చంద రవి (28) అనే యువకుడు దుబాయ్లో హత్యకు గురయ్యాడు. రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లిన అతను.. కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతీ నెలా ఇంటికి డబ్బు పంపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
రెండు నెలల క్రితం నిజామాబాద్ జిల్లా భీంగల్ కు చెందిన ఓ యువకుడితో రవికి గొడవ తలెత్తింది. అయితే గొడవ తర్వాత రవి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ యువకుడు మాత్రం కక్ష రవి మీద పెంచుకున్నాడు.
గురువారం ఉదయం రవి ఉంటున్న ఫ్లాట్ వద్దకు వచ్చి కత్తితో పొడిచి అతన్ని దారుణంగా హత్య చేశాడు. దాడి సమయంలో రవి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న స్నేహితులు పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అప్పటికే హంతకుడు పారిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రవి మృతి వార్తతో అతని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరి కొన్ని నెలల్లో ఇంటికి వస్తాడనుకున్న భర్త చనిపోయాడని తెలియడంతో భార్య షాక్ కు గురైంది. రవికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.