తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్ ఎప్పుడంటే..?
తెలంగాణలో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ ప్రకటించింది.విద్యాసంవత్సరం 229 పనిదినాలను కలిగి ఉంటుందని, ఆఖరి రోజు వచ్చే ఏడాది ఏప్రిల్ 23వ తేదీన ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నడుస్తాయి.SSC పరీక్షలు మార్చి 2025న నిర్వహించబడతాయి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)కి అనుబంధంగా ఉన్న పాఠశాలలు ఇప్పటికే మార్చి, ఏప్రిల్ నెలల్లో 2024-25 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించగా.. రాష్ట్ర బోర్డుచే గుర్తింపు పొందిన పాఠశాలలు జూన్ 12 నుండి విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తాయి. ఇదిలావుండగా.. జూన్ 1 నుండి 9 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో బడి బాట (అడ్మిషన్ డ్రైవ్)ను విద్యాశాఖ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించాలని సూచిస్తారు. బడి మానేసిన పిల్లలు లేదా చదువు మానేసిన విద్యార్థులను కూడా గుర్తించి వారి వయస్సు ప్రకారం తగిన తరగతిలో పాఠశాలల్లో చేర్పించాలని పిల్లలకు తల్లిదండ్రులను ఉపాధ్యాయులు కోరునున్నారు.












Click it and Unblock the Notifications