స్నేహితుడి కోసం వచ్చి పరలోకాలకు...: ముగ్గురిని మింగిన గోదావరి
బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ ఏరియాలకు చెందిన మందలింగయ్య రెండు వారాల కిందట మృతిచెందాడు.
మంచిర్యాల: బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ ఏరియాలకు చెందిన మందలింగయ్య రెండు వారాల కిందట మృతిచెందాడు. ఈ క్రమంలో గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు మృతుడి తమ్ముడు మొగిళి తన కుటుంబసభ్యులు, కుమారుడి స్నేహితులతో కలిసి ముల్కల్లలోని గోదావరికి పుణ్యస్నానాలకు వెళ్లారు. ఇందులో భాగంగా అనిల్, ఆసంపల్లి మహేష్, మిట్టపల్లి వేణులు స్నానాలు చేస్తూ నదిలో కొట్టుకుపోయారు.
స్నేహితుని కోసం కుటుంబసభ్యులతో కలిసి వచ్చి గల్లంతవడంతో ఆ ముగ్గురి యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.అనిల్, మహేష్, వేణు చిన్నానాటి నుంచి స్నేహితులు. కుటుంబ సభ్యులు వారిస్తున్నా తక్కువ లోతే అంటూ మరింత దూరం వెళ్లడంతో ప్రవాహ ఉద్ధృతిలో కొట్టుకుపోయారు. ఈ ఘటనతో బెల్లంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరణంలో కూడా స్నేహాన్ని విడలేదని కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.
మంచిర్యాల్ జిల్లా హాజిపూర్ మండలం ముల్కల్ల గోదావరి వద్ద ఆదివారం గల్లంతైన ముగ్గురి యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి.. బెల్లంపల్లి పట్టణం ఇంక్లైన్ రడగంబాల బస్తీకి చెందిన అనిల్, మహేష్, వేణులు స్నానాలు చేస్తూ గోదావరిలో ప్రవాహానికి నీటిలో కొట్టుకపోయారు.
విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం గజ ఈతగాళ్ల సాయంతో వారి ఆచూకీ కోసం వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో సింగరేణి రెస్క్యూ టీం ను రంగంలోకి దించారు. సోమవారం ఉదయం ముగ్గురి మృతదేహాలు లభించాయి.