తెలుగు చిత్రసీమలో మరో విషాదం: కరోనాతో గాయకుడు జీ ఆనంద్ కన్నుమూత
హైదరాబాద్: తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ సినీ గాయకుడు జీ ఆనంద్()67 కరోనా బారినపడి గురువారం రాత్రి కన్నుమూశారు. కరోనా చికిత్సలో బాగంగా సకాలంలో వెంటిలేటర్ లబించకపోవడంతో ఆనంద్ మృతి చెందినట్లు సమాచారం.
ఆనంద్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగమ్ గ్రామం. ఐదు దశాబ్ధాలుగా సినీ సంగీత రంగంలో ఆయన కొనసాగుతున్నారు. స్వరమాధురి సంస్థ స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా 6500కుపైగా కచేరీలో నిర్వహించారు. ప్రస్తుతం సినీగాయనీ గాయకులుగా ఉన్న పలువురు ఈ సంస్థ ప్రోత్సహం వల్ల వచ్చిన వారే కావడం గమనార్హం.

Recommended Video
ఒక వేణువు వినిపించెను(అమెరికా అమ్మాయి) , దిక్కులు చూడకు రామయ్య.., విఠలా విఠలా పాండురంగ విఠలా.. వంటి సూపర్ హిట్ పాటలను ఆనంద్ ఆలపించారు. కృష్ణ నటించిన పండంటి కాపురం, గాంధీన్ రెండో వీధి, స్వాతంత్ర్యానికి ఊపిరిపోయండి, రంగవల్లి చిత్రాలకు సంగీత దర్శకుడిగా కూడా ఆనంద్ వ్యవహరించారు. పలు అనువాద చిత్రాలకు, సీరియల్స్కు ఆయన సంగీతం అందించారు. గత సంవత్సరం ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కూడా కరోనాతో మరణించిన విషయం విధితమే.
-
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఆశా భోంస్లే 'స్వర' సామ్రాజ్యం.. ఆస్తుల గురించి షాకింగ్ నిజాలు! -
ఆశాభోస్లే - లతా మంగేష్కర్.. అక్క చెల్లెల మధ్య అసలు గొడవేంటి ??? -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను.. -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే!












Click it and Unblock the Notifications