వరంగల్లో దీక్షా దివస్
వరంగల్: కెసిఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం దీక్ష చేపట్టి నేటికి 7 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా టిఆర్ఎస్ ఆద్వర్యంలో దీక్షా దివస్ పేరుతో వరంగల్ లోని కాళోజీ సెంటర్ లో టీఆర్ఎస్ నాయకులు దీక్షను చేపట్టారు. ఏడు సంవత్సరాల క్రితం కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ ఇదే రోజు (నవంబర్ 29) ఉద్యమం చేపట్టి, నిరాహారదీక్షకు దిగిన ఈ రోజును టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దీక్షా దివస్ పేరిట ప్రతి ఏటా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications