టీఆర్ఎస్కు షాక్: బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్, కండువా కప్పిన అమిత్ షా
Recommended Video

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గట్టి షాక్ తగిలింది. టీఆర్ఎస్ నేత, ఆందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం ఉదయం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్తో కలిసి బాబుమోహన్ ఢిల్లీ వెళ్లారు.
శనివారం మధ్యాహ్నం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా.. బాబుమోహన్కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అందోల్ నుంచి గెలుపొందన బాబుమోహన్కు తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే.

అసెంబ్లీ రద్దు అనంతరం 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్.. అందోల్ టికెట్ను బాబు మోహన్ను కాదని జర్నలిస్టు క్రాంతి కుమార్కు ఇచ్చారు. ఈ క్రమంలో ఎంత కష్టపడి పనిచేసినా కూడా టీఆర్ఎస్ పెద్దలు తనపై వివక్ష చూపుతున్నారని బాబుమోహన్ తన సన్నిహితుల వద్ద విచారం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ టికెట్ నిరాకరిచండంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అందోల్ టికెట్ ఇస్తామని బీజేపీ నుంచి తనకు హామీ లభించడంతోనే ఆయన ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం అందోల్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో బాబుమోహన్ చేరిక తమకు లాభిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications