వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో కొత్తగా 7 మెడికల్ కాలేజీలు -వ్యాక్సిన్లపై కీలక ప్రకటన -లాక్‌డౌన్ సహా కేబినెట్ నిర్ణయాలివే

|
Google Oneindia TeluguNews

కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ను మరో 10 రోజులపాటు, అంటే జూన్ 1 వరకు పొడగించిన కేసీఆర్ సర్కారు.. రాష్ట్రంలో వైద్య సదుపాయాల కల్పన, వ్యాక్సినేషన్ ప్రక్రియపైనా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆదివారం సాయంత్ర సుదీర్ఘంగా 5 గంటలపాటు సాగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు అంశాలకు ఆమోదం లభించింది...

ఢిల్లీకి ఈటల రాజేందర్: బీజేలో చేరేందుకే! -ఆయన వెనకాలే బండి సైన్యం పయనం -హైకమాండ్ మాటిదేఢిల్లీకి ఈటల రాజేందర్: బీజేలో చేరేందుకే! -ఆయన వెనకాలే బండి సైన్యం పయనం -హైకమాండ్ మాటిదే

రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో ఏడు మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుకు తెలంగాణ కేబినేట్ ఆమోదం తెలిపింది. మ‌హ‌బూబాబాద్‌, జ‌గిత్యాల‌, సంగారెడ్డి, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, కొత్త‌గూడెం, మంచిర్యాల జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క ముందు కేవ‌లం నాలుగు మెడిక‌ల్ కాలేజీలే ఉన్నాయ‌ని, 2014- 18 మ‌ధ్య కొత్తగా ఐదు కాలేజీల‌ను ఏర్పాటు చేశామని, ఇప్పుడు మరో ఏడింటిని ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక

TS Cabinet approves for 7 new medical colleges, vaccine priority to foreign going students

వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు వెళుతోన్న తెలంగాణ.. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న టీకాలను జర్నలిస్టులు, వ్యాపారులకు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా టీకాల విషయంలో ప్రాధాన్యత ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వ్యాక్సినేష్ ప్రక్రియకు సంబంధించి త్వ‌రలో మార్గ ద‌ర్శ‌కాలు విడుద‌ల కానున్నాయి.

అసదుద్దీన్ ఓవైసీ సంచలనం-లాక్‌డౌన్ వద్దు, వ్యాక్సిన్లు ఇవ్వండి-కేసీఆర్‌ను ఉద్దేశించి తొలిసారి తెలుగులో ట్వీట్లుఅసదుద్దీన్ ఓవైసీ సంచలనం-లాక్‌డౌన్ వద్దు, వ్యాక్సిన్లు ఇవ్వండి-కేసీఆర్‌ను ఉద్దేశించి తొలిసారి తెలుగులో ట్వీట్లు

Recommended Video

Hyderabad : చేప మందు పై బత్తిన సోదరుల క్లారిటీ!!

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం 5 గంట‌ల పాటు కొన‌సాగింది. భూములు, ఆస్తుల రిజిస్ట్రేష‌న్ల‌తో పాటు వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ల‌కు కేబినెట్ అనుమ‌తించింది. లాక్ డౌన్ స‌డ‌లింపు స‌మ‌యాల్లో ఈ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. వ్య‌వ‌సాయ రంగంపై కూడా కేబినెట్ చ‌ర్చించి, ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ది. లాక్‌డౌన్‌ను మ‌రో ప‌ది రోజుల పాటు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణ‌యం తీసుకున్న‌ది. గతంలో నాలుగు గంటలు మాత్రమే ఉన్న సడలింపును ఇప్పుడు ఏడు గంటలకు పెంచారు. అంటే, ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు స‌డ‌లింపు ఉంటుంది.

English summary
other than Lockdown in Telangana has been extended by 10 more days, Chief Minister KCR led state cabinet take key decisions on sunday. the Cabinet decided to construct seven new medical colleges in the state. They will come up at Mahabubabad, Rangareddy, Jagtial, Nagarkurnool, Wanaparthy, Kothagudem, and Mancherial districts. Students from Telangana who need to travel abroad for higher education will be vaccinated on priority basis, says minister ktr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X