తలసాని సహా వారిపై ఫిర్యాదు, తెలంగాణ 'ప్రత్యేక' రాష్ట్రమా?: టీడీపీ
హైదరాబాద్: తమ పార్టీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం నాడు సభాపతి మధుసూదనాచారిని కలిశారు. స్పీకర్ను వారు ఆయన నివాసంలో కలిశారు.
ఆయనకు వినతిపత్రం అందించారు. స్పీకర్ను కలిసిన వారిలో తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, తెలంగాణ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులున్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా భావిస్తున్నట్లు కనబడుతోందని మండిపడ్డారు. సభాపతి దృష్టి పెట్టకపోవడంతో కేసీఆర్ రాజకీయ రాబందులా మారి ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు.

టీఆర్ఎస్లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. తమ పార్టీ టిక్కెట్ పైన గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండానే తెలంగాణ ప్రభుత్వం కేబినెట్లో మంత్రిగా ఎలా ఉంటారని ప్రశ్నించారు.
గోదావరి పుష్కరాలను ఘనంగా: పోచారం
తెలంగాణ రాష్ట్రంలో జరిగే తొలి గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి, పోచంపాడులోని పుష్కరఘాట్లను ఆయన పరిశీలించారు. ఈ నెలఖరులోగా పుష్కరాల ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామన్నారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications