వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల పరారీ
వరంగల్: వరంగల్ కేంద్ర కారాగారం నుంచి ఇద్దరు ఖైదీలు శనివారం తెల్లవారుజామున తప్పించుకున్నారు. ఘటనపై వరంగల్ జైలు డీఐజీ కేశవరావు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 2గంటల ప్రాంతంలో ఖైదీలు పరారయ్యారు. ఇందుకు వీరు తమ బెడ్ షీట్ ఉపయోగించారు.
బెడ్ షీట్ ను ఉపయోగించిన ఖైదీలు సెంట్రల్ జైలు ప్రహారీ గోడ ఎక్కి పారిపోయారు. ఇద్దరు ఖైదీల్లో ఒకరైన రాజేష్ యాదవ్ ఒక హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్నాడు. మరో ఖైదీ సైనిక్ సింగ్ కోర్టు ఆఫ్ మార్షల్స్లో ఖైదీ.

సైనిక్ సింగ్ గతంలో క్రాఫ్ట్ మన్గా విధులు నిర్వహించినట్లు డీఐజీ తెలిపారు. వీరిద్దరూ కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వారే. వీరు గత రెండు నెలల క్రితం చర్లపల్లి జైలు నుంచి వరంగల్ జైలుకు తరలించబడ్డారు. పరారైన ఖైదీల కోసం పోలీసులు విస్తృత గాలింపు చేపట్టినట్లు డీఐజీ తెలిపారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications