'సంతోషం': వర్సిటీల జాబితాలో హెచ్సీయూకి 4, ఉస్మానియాకు 33
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ కళాశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో తెలుగురాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాల కేటగిరీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కు దేశంలోనే నాలుగో ర్యాంకు సాధించింది.
విశ్వవిద్యాలయాల కేటగిరీలో వంద యూనివర్సిటీల జాబితాను కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు విశ్వవిద్యాలయాలకే ఈ జాబితాలో స్థానం లభించింది. ఇందులో మూడు తెలంగాణకు, మూడు ఆంధ్రప్రదేశ్కు చెందినవి ఉన్నాయి.
ఇక ఇంజినీరింగ్ కళాశాలల్లో హైదరాబాద్ ఐఐటీకి 7వ స్థానం, వరంగల్ ఎన్ఐటీకి 28వ స్థానం దక్కింది. వందలోపు ర్యాంకులు పొందిన ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందినవి ఆరు ఉన్నాయి. ఇందులో తెలంగాణకు చెందినవి మూడు కాగా ఆంధ్రప్రదేశ్కు చెందినవి మూడు.
ఫార్మసీ కళాశాలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి మూడింటికి ర్యాంకులు లభించాయి. ఫార్మసీ కళాశాలల విభాగంలో వరంగల్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్కు 16వ స్థానం లభించింది. ఇక మేనేజ్మెంట్ రంగంలో హైదరాబాద్లోని ప్రైవేటు సంస్థ ఐపీఈకి 38వ ర్యాంకు లభించింది.

యూనివర్సిటీ ర్యాంకులు:
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ - హైదరాబాద్ - (4వ ర్యాంకు)
ట్రిపుల్ ఐటీ (డీమ్డ్ వర్సిటీ) - హైదరాబాద్ - (23వ ర్యాంకు)
ఉస్మానియా విశ్వవిద్యాలయం - హైదరాబాద్ - (33వ ర్యాంకు)
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ - తిరుపతి - (63వ ర్యాంకు)
జెఎన్టీయూ - కాకినాడ - (69వ ర్యాంకు)
యోగివేయన యూనివర్సిటీ - కడప - (92వ ర్యాంకు)
ఇంజనీరింగ్ ర్యాంకులు:
ఐఐటీ - హైదరాబాద్ - (7వ ర్యాంకు)
ఎన్ఐటీ - వరంగల్ - (28వ ర్యాంకు)
కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ పౌండేషన్ - గుంటూరు - (59వ ర్యాంకు)
సీబీఐటీ - హైదరాబాద్ - (71వ ర్యాంకు)
సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కాలేజీ - భీమవరం - (73వ ర్యాంకు)
విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ - గుంటూరు - (88వ ర్యాంకు)
మేనేజ్మెంట్:
ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ - హైదరాబాద్ - (38వ ర్యాంకు)
హెచ్ సీయూకు 4వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది: వీసీ
హైదరాబాద్ హెచ్సీయూకు దేశంలోనే 4వ ఉత్తమ వర్సిటీగా గుర్తింపు రావడం పట్ల వీసీ పి.అప్పారావు, విద్యార్దులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్లు, విద్యార్ధులు, బోధనేతర సిబ్బంది కృషి వల్లే హెచ్ సీయూకి నాలుగో స్దానం దక్కిందని వీపీ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే బెంగళూరులోని ఐఐఎస్సీ 91.81 పాయింట్లతో దేశంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో మద్రాస్ ఐఐటీ (89.41 పాయింట్లు), మేనేజ్మెంట్ విభాగంలో బెంగళూరు ఐఐఎం (93.04 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచాయి. ఇటీవల వివాదాలతో వార్తల్లోకెక్కిన జేఎన్యూ, హెచ్సీయూ వర్సిటీల జాబితాలో మూడు, నాలుగో ర్యాంకుల్ని సాధించాయి.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications