అలా వెళ్లగానే కూలింది: మేయర్ బొంతు రామ్మోహన్కు తప్పిన ప్రమాదం
కూలిన భవనం గోడను పరిశీలించేందుకు వెళ్లిన మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డిలు మంగళవారం నాడు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
హైదరాబాద్: సోమవారం నాడుహైదరాబాదులో ఓ భవనం గోడ కూలింది. దీనిని పరిశీలించేందుకు వెళ్లిన మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డిలు మంగళవారం నాడు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు పరిశీలించి వెళ్లిన కాసేపటికే ఆరో అంతస్తు గోడ కూలడం గమనార్హం.
సికింద్రాబాదులోని చంద్రలోక్ కాంప్లెక్స్ వద్ద మేయర్ బొంతు, కమిషనర్ జనార్దన్ రెడ్డిలు పర్యటించారు. భవనం స్థితిగతులను పరిశీలించారు. సోమవారం సాయంత్రం చంద్రలోక్ కాంప్లెక్స్ భవనం గోడ కూలి దుర్గయ్య మృతి చెందాడు.

ఘటనాస్థలాన్ని మేయర్, కమిషనర్లు ఉన్నతాధికారులతో కలిసి ఉదయం పరిశీలించారు. 40 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన భవనం కావడం, నిర్వహణ లోపం వల్లే ఈ ఘటన జరిగిందని మేయర్ తెలిపారు.
జేఎన్టీయూ ఇంజినీర్లతో కమిటీ వేసి, ఆ కమిటీ నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. భవన సముదాయాన్ని పూర్తిగా మూసివేశామన్నారు. దుర్గయ్య కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, మేయర్, కమిషనర్ వెళ్లిన కాసేపటికే ఆరో అంతస్థు గోడ కూలింది. అందరూ వెళ్లిన తర్వాత గోడ కూలడంతో పెను ప్రమాదం తప్పింది.
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!












Click it and Unblock the Notifications