అలా వెళ్లగానే కూలింది: మేయర్ బొంతు రామ్మోహన్కు తప్పిన ప్రమాదం
కూలిన భవనం గోడను పరిశీలించేందుకు వెళ్లిన మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డిలు మంగళవారం నాడు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
హైదరాబాద్: సోమవారం నాడుహైదరాబాదులో ఓ భవనం గోడ కూలింది. దీనిని పరిశీలించేందుకు వెళ్లిన మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డిలు మంగళవారం నాడు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు పరిశీలించి వెళ్లిన కాసేపటికే ఆరో అంతస్తు గోడ కూలడం గమనార్హం.
సికింద్రాబాదులోని చంద్రలోక్ కాంప్లెక్స్ వద్ద మేయర్ బొంతు, కమిషనర్ జనార్దన్ రెడ్డిలు పర్యటించారు. భవనం స్థితిగతులను పరిశీలించారు. సోమవారం సాయంత్రం చంద్రలోక్ కాంప్లెక్స్ భవనం గోడ కూలి దుర్గయ్య మృతి చెందాడు.

ఘటనాస్థలాన్ని మేయర్, కమిషనర్లు ఉన్నతాధికారులతో కలిసి ఉదయం పరిశీలించారు. 40 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన భవనం కావడం, నిర్వహణ లోపం వల్లే ఈ ఘటన జరిగిందని మేయర్ తెలిపారు.
జేఎన్టీయూ ఇంజినీర్లతో కమిటీ వేసి, ఆ కమిటీ నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. భవన సముదాయాన్ని పూర్తిగా మూసివేశామన్నారు. దుర్గయ్య కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, మేయర్, కమిషనర్ వెళ్లిన కాసేపటికే ఆరో అంతస్థు గోడ కూలింది. అందరూ వెళ్లిన తర్వాత గోడ కూలడంతో పెను ప్రమాదం తప్పింది.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications