Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్‌లోనే ఎందుకు చేరుతున్నామంటే?: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు క్లారిటీ

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీలో చేరనున్న సీనియర్ రాజకీయ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం ఈ ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలు కేసీఆర్‌ను గెలిపించారని.. కానీ, ప్రజల ఆకాంక్షలను ఆయన నెరవేర్చలేదని విమర్శించారు.

మాటల గారడీలో సీఎం కేసీఆర్ సిద్ధహస్తుడని, అలాంటి వ్యక్తిని గద్దె దించాలని గట్టి పార్టీతో ప్రయాణించాలని నిర్ణయించుకుని కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి చెప్పారు. కేసీఆర్ స్కీంల పేరుతో మాయ చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుందో చూస్తూనే ఉన్నామన్నారు. నీళ్లు, నిధులు, నియామక హామీలు నెరవేర్చలేదని కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు.

We are joining in congress on july 2nd on the presence of Rahul Gandhi: Ponguleti Srinivas Reddy, Jupally Krishna Rao

పదవులు, డబ్బులు ఒక్కటే నాయకులకు ముఖ్యం కాదని.. పదవుల కంటే ఆత్మగౌరవం ముఖ్యమని పొంగులేటి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిందన్నారు. కొంతకాలంగా తాను, జూపల్లి అనేక చోట్ల ఆత్మీయ సభలు నిర్వహించామన్నారు. ఒక దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలని భావించామన్నారు. ప్రాంతీయ పార్టీ పెట్టడంపై అభిప్రాయ సేకరణ చేశామని.. కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని భావించామని తెలిపారు. అందుకే పార్టీ పెట్టలేదని చెప్పారు.

ప్రాంతీయ పార్టీ పెట్టడం కంటే కాంగ్రెస్ పార్టీలో చేరడం మంచిదని మేధావులు సూచించారని పొంగులేటి తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ గ్రాఫ్ పెంచిందన్నారు. కర్ణాటకలో విజయంతో కాంగ్రెస్ మరింత పుంజుకుందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ పరిస్తితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు.

అన్ని పరిణామాలను బేరీజు వేసుకుని బీజేపీలో కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెండుసార్లు కేసీఆర్‌కు అవకాశమిచ్చారని.. మరోసారి ఇస్తే మరింత దారుణ పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరారు. జులై 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు పొంగులేటి తెలిపారు. ఆ ఖమ్మం సభకు ఎన్ని లక్షల మంది వస్తారో లెక్కలేసుకోండంటూ బీఆర్ఎస్ నేతలకు పొంగులేటి సవాల్ విసిరారు.

మరోవైపు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తమ ప్రాణాలు త్యాగాలు చేశారని.. తాము తమ పదవులను వదిలి ఉద్యమంలో పాల్గొన్నామన్నారు. తెలంగాణ వచ్చాక తమ అంచనాలన్నీ తప్పాయన్నారు. కేసీఆర్ పాలన అంతా బోగస్ మాటలు, పథకాలతో సాగుతోందని విమర్శించారు. ఎప్పటికప్పుడు కొత్త స్కీంలతో జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ప్రశ్నించే గొంతకే ఉండొద్దని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. కేసీఆర్ తీరు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించేలా ఉందని మండిపడ్డారు.

దేశంలో ఎన్నడూ లేనంతగా ప్రచారానికి డబ్బులు ఖర్చుపెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ నియంతృత్వ దోరణి పరాకష్టకు చేరిందని మండిపడ్డారు జూపల్లి. మంత్రలను కూడా కేసీఆర్ మనుషులుగా చూడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వకపోతే దేవుడు కూడా క్షమించడన్నారు. తమకు నష్టం వాటిల్లుతుందని తెలిసినా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్లు జూపల్లి కృష్ణారావు తెలిపారు. కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావద్దని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+