పేదోడి సొంతింటి కల నెరవేర్చి తీరుతాం.!మరోసారి స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కవిత.!
జగిత్యాల/హైదరాబాద్ : ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో సారి స్పష్టం చేసారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపెల్లి వద్ద నిర్మిస్తున్న 4520 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, జగిత్యాల ప్రజలు జిల్లా కావాలని దశాబ్దాలుగా కోరుకున్నారని, ఆ కలను సీఎం చంద్రశేకర్ రావు నెరవేర్చారని కవితి ఉద్ఘాటించారు. ఇచ్చిన ప్రతి హామీని చంద్రశేకర్ రావు అమలు చేస్తున్నారని కవిత తెలిపారు.

జగిత్యాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పరిశీలన.. పేదోడి కల నెరవేర్చుతామన్న కవిత..
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత జగిత్యాలలోనే ఒకేచోట పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, నిర్మాణ పనులు సైతం వేగవంతంగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇండ్ల నిర్మాణ పనులు త్వరిగతిన పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గతంలో గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇండ్లకు, టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిస్తున్న ఇండ్లకు చాలా తేడా ఉందని, ఇక్కడి ఇంటి నిర్మాణలు చూస్తే సీఎం చంద్రశేఖర్ రావు సంతోష పడతారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

కవిత చెప్తే కరెక్ట్.. జగిత్యాలలో సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి కోసం ప్రయత్నిస్తానన్న ఎమ్మెల్సీ..
వచ్చే సంవత్సరం జూన్ లో గా ఇంటి నిర్మాణలు పూర్తి చేసి పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తామని తెలిపారు. జగిత్యాల అభివృద్దికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్న ఎమ్మెల్సీ కవిత, సీఎం చంద్రశేఖర్ రావు ఇచ్చిన మాట ప్రకారం జగిత్యాల జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేశారన్నారు. అంతేకాదు జగిత్యాలలో సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి కోసం సీఎంతో మాట్లాడుతాని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డా.సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ రవినాయక్, మునిసిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి పాల్గొన్నారు.

సుమన్ కు ఓదార్సు.. విప్ బాల్క సుమన్ ను పరామర్శించిన కవిత
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాల్క సుమన్ తండ్రి, TRS పార్టీ సీనియర్ నాయకులు, మెట్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ బాల్క సురేష్ అనారోగ్యంతో స్వర్గస్తులైయ్యారు. ఈ రోజు ఎమ్మెల్సీ కవిత, MLA బాల్క సుమన్ స్వగ్రామం రేగుంటలో స్వర్గీయ సురేష్ చిత్ర పటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కార్పోరేటర్ బాబా ఫసియుద్దిన్ పాల్గొన్నారు.

జగదీష్ రెడ్డి పరామర్శ.. బాల్కసుమన్ కు మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ..
పితృ వియోగం చెందిన చెన్నూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ ను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పరామర్శించారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్,తుంగతుర్తి శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మెట్ పల్లి పట్టణ సమీపంలోనీ రేణిగుంటలో బాల్కా సుమన్ ఇంటికి చేరుకున్న మంత్రి జగదీష్ రెడ్డి బాల్క సుమన్ తండ్రి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బాల్క సురేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో పాటు కుటుంబ సభ్యులను మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications