నిన్న మోడీని మెచ్చుకొని తిట్టడమా, అది వాపు: రేవంత్పై కిషన్ రెడ్డి
హైదరాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని ఆ పార్టీ తెలంగాణ నేత, శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి మంగళవారం అన్నారు. గుజరాత్లో బీజేపీ డబుల్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసిందన్నారు.
కుహనా మేధావులు, విశ్లేషకులు ఆ విజయాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్లో కాంగ్రెస్కు వచ్చిన సీట్లు బలుపు కాదని, వాపు అన్నారు. ఓట్లు పెరిగి సీట్లు తగ్గితే బీజేపీ మీద విషం కక్కుతారా? అని ప్రశ్నించారు.
కేసీఆర్లాగే, మోడీ ఎంత దిగజారారో చెప్పేందుకు ఇది చాలు: రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య
తెలంగాణ విషయమై మాట్లాడుతూ.. రేపు, ఎల్లుండి బీజేపీ రూట్ మ్యాప్ తయారు చేస్తున్నామని, వివిధ స్థాయిల్లో ముఖ్య నాయకులతో సమావేశాలు ఉంటాయని చెప్పారు. నిన్నటి దాకా మోదీని పొగిడిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్లో చేరి విమర్శించడం సిగ్గుచేటు అన్నారు.