బావిలో పడిన ఎలుగుబంట్లు
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని శ్రీరాములుపేట శివారులోని వ్యవసాయ బావిలో మూడు ఎలుగుబంట్లు పడ్డాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు సకాలంలో స్పందించలేదు. వారు నామమాత్రంగా బావిలో నిచ్చెన వేసి వెళ్లిపోయారు. బావిలో నీళ్లు ఉండటంతో బయటకురాలేక ఎలుగుబంట్లు మృత్యువాత పడ్డాయి.
Comments
English summary
Bear falls into well in Telangana.
Story first published: Friday, October 7, 2016, 19:38 [IST]