చిన్నారుల హత్య: 'పోస్టుమార్టం చేయెద్దు' (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్లో సంపులో తోసి చిన్నారుల హత్య చేసిన సంఘటన మంగళవారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం మాజీ సర్పంచ్ నేటి యాదగిరి, పద్మలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
వీరు ప్రస్తుతం ఎల్బీ నగర్లోని చంద్రపురి కాలనీ రోడ్ నెంబర్ -5లో నివసిస్తున్నారు. పెద్ద కుమార్తె నిర్మలకు చౌటుప్పల్ మండలం అంతమ్మగూడెంకు చెందిన వస్పరి మల్లేష్తో ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. మామ యాదగిరి, మల్లేష్ ఎల్బీనగర్లో బోర్వెల్స్తో పాటు ఇసుక లారీల వ్యాపారం చేస్తున్నారు.
గత కొంత కాలంగా అద్దె ఇంట్లో ఉంటున్న మల్లేష్ ఇటీవలే కుటుంబంతో అత్తవారింట్లోకి వచ్చారు. వీరికి అక్షర (2), సహస్ర (7 నెలలు) అనే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవు. నిర్మలకు అప్పుడప్పుడు హైబీపీ, ఫిట్స్ రావడంతో వివిధ ఆస్పత్రులలో చికిత్స చేయించారు.
వీటి మూలంగా అప్పుడప్పుడు చనిపోతానంటూ తల్లిదండ్రులు, భర్తతో నిర్మల చెప్పేదని పోలీసులు తెలిపారు. మంగళవారం నాడు భర్త, తండ్రి పనిమీద బయటకు వెళ్లినప్పుడు తల్లి పద్మ ఆసుపత్రికి వెళ్లారు. మధ్యాహ్నాం 3.30 గంటలకు కార్పోరేషన్ నీరు వచ్చింది.
ఇదే సందర్భంలో నిర్మలకు ఫిట్స్, హైబీపీ రావడంతో పిల్లలను చంపి, ఆత్మచేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో అద్దెకు ఉన్నవారు మంచినీరు పట్టుకునేందుకు సంపు మూతను తెరిచారు. మంచి నీరు పట్టుకున్న తర్వాత, నిద్రిస్తున్న చిన్నారులు సహస్ర, అక్షరలను నిర్మల సంపులో వేసింది.

సంపులో తోసి చిన్నారులను హత్య చేసిన కన్న తల్లి
నగరంలోని ఎల్బీ నగర్లో సంపులో తోసి చిన్నారుల హత్య చేసిన సంఘటన మంగళవారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

సంపులో తోసి చిన్నారులను హత్య చేసిన కన్న తల్లి
చిన్నారులు తండ్రి మల్లేష్, తాతా యాదగిరి, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని విగతజీవులైన చిన్నారులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

సంపులో తోసి చిన్నారులను హత్య చేసిన కన్న తల్లి
ప్రస్తుతం ఎల్బీ నగర్లోని చంద్రపురి కాలనీ రోడ్ నెంబర్ -5లో నివసిస్తున్నారు. పెద్ద కుమార్తె నిర్మలకు చౌటుప్పల్ మండలం అంతమ్మగూడెంకు చెందిన వస్పరి మల్లేష్తో ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. మామ యాదగిరి, మల్లేష్ ఎల్బీనగర్లో బోర్వెల్స్తో పాటు ఇసుక లారీల వ్యాపారం చేస్తున్నారు.
సంపులో తోసి చిన్నారులను హత్య చేసిన కన్న తల్లి
ప్రస్తుతం ఎల్బీ నగర్లోని చంద్రపురి కాలనీ రోడ్ నెంబర్ -5లో నివసిస్తున్నారు. పెద్ద కుమార్తె నిర్మలకు చౌటుప్పల్ మండలం అంతమ్మగూడెంకు చెందిన వస్పరి మల్లేష్తో ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. మామ యాదగిరి, మల్లేష్ ఎల్బీనగర్లో బోర్వెల్స్తో పాటు ఇసుక లారీల వ్యాపారం చేస్తున్నారు.

సంపులో తోసి చిన్నారులను హత్య చేసిన కన్న తల్లి
ఇదే సందర్భంలో నిర్మలకు ఫిట్స్, హైబీపీ రావడంతో పిల్లలను చంపి, ఆత్మచేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో అద్దెకు ఉన్నవారు మంచినీరు పట్టుకునేందుకు సంపు మూతను తెరిచారు. మంచి నీరు పట్టుకున్న తర్వాత, నిద్రిస్తున్న చిన్నారులు సహస్ర, అక్షరలను నిర్మల సంపులో వేసింది.

సంపులో తోసి చిన్నారులను హత్య చేసిన కన్న తల్లి
సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని నిర్మలను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సంపులో తోసి చిన్నారులను హత్య చేసిన కన్న తల్లి
తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న సందర్భంలో బయటి నుంచి వచ్చిన తల్లి పద్మ సంపు దగ్గర ఎందుకు నిలబడ్డావని కుమార్తెను ప్రశ్నించింది. దీంతో ఆమె సంపు మూత వేసి ఇంట్లోకి వెళ్లింది. ఇంట్లో పిల్లలు కనిపించకపోడవం, ఎక్కడ ఉన్నారని తల్లి అడగడంతో సంపులో వేశానని తెలిపింది.

సంపులో తోసి చిన్నారులను హత్య చేసిన కన్న తల్లి
నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం మాజీ సర్పంచ్ నేటి యాదగిరి, పద్మలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు ప్రస్తుతం ఎల్బీ నగర్లోని చంద్రపురి కాలనీ రోడ్ నెంబర్ -5లో నివసిస్తున్నారు. పెద్ద కుమార్తె నిర్మలకు చౌటుప్పల్ మండలం అంతమ్మగూడెంకు చెందిన వస్పరి మల్లేష్తో ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు.
తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న సందర్భంలో బయటి నుంచి వచ్చిన తల్లి పద్మ సంపు దగ్గర ఎందుకు నిలబడ్డావని కుమార్తెను ప్రశ్నించింది. దీంతో ఆమె సంపు మూత వేసి ఇంట్లోకి వెళ్లింది. ఇంట్లో పిల్లలు కనిపించకపోడవం, ఎక్కడ ఉన్నారని తల్లి అడగడంతో సంపులో వేశానని తెలిపింది.
దీంతో తల్లి పద్మ బిగ్గరగా కేకలు వేయడంతో, ఇంటి పక్కనే ఉన్న కృష్ణారెడ్డి వచ్చి సంపులోకి దిగి పిల్లలను బయటకు తీశారు. అప్పటికే చిన్నారులు ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటనతో స్థానికులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఇక చిన్నారులు తండ్రి మల్లేష్, తాతా యాదగిరి, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని విగతజీవులైన చిన్నారులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని నిర్మలను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
తన పిల్లలను పోస్టుమార్టం చేయవద్దని చిన్నారులు తండ్రి మల్లేష్ పోలీసులను వేడుకున్నాడు. చిన్నారుల మృతిపై స్పందించిన బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనూరాధరావు మాట్లాడుతూ నిజానిజాలు తెలుసుకుని బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications