యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి భారీ ఆదాయం...ఎన్ని కోట్లో తెలుసా..?
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆలయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం. ఈ ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఈ సారి ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. జనవరి 4 నుంచి28 వ తేది వరకు మొత్తం 25రోజుల్లో రూ. 2.32కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఈ తేదీల్లో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా స్వామివారికి కానుకలు సమర్పించారు. ఈ కానుకల్లో రూ .2,32,22,689 నగదు ఉండగా, 230 గ్రాముల మిశ్రమ బంగారం, 4.420 కిలోగ్రాముల మిశ్రమ వెండి ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

వీటితోపాటు లక్ష్మీ నరసింహ స్వామి వారికి విదేశీ కరెన్సీ కూడా ఆలయ హుండీల్లో కానుకల రూపంలో వచ్చాయని దేవస్థాన ఈవో రామకృష్ణారావు తెలిపారు. అందులో అమెరికన్ డాలర్లు 593 ఉండగా, యూఏఈ దిర్హామ్స్ 65, ఆస్ట్రేలియా డాలర్స్ 65, కెనడా డాలర్లు 220, 10 సింగపూర్ డాలర్లు, 10 ఇంగ్లాండ్ పౌండ్లు, 122 సౌత్ ఆఫ్రికన్ రాండ్లు, 15 యూరప్ యూరోలు, 400 ఒమన్ రియాల్, 2 మలేషియా రింగిట్స్, 23 కతార్ రియాల్, 100 థాయిలాండ్ భాట్, 5 న్యూజిలాండ్ డాలర్లు, 1000 డెన్మార్క్ డ్యానిష్ క్రోన్, 10,00,000 వియత్నాం డాలర్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

శ్రీయాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 25 రోజుల హుండీ ఆదాయం..!! pic.twitter.com/7QBRolmJOm
— oneindiatelugu (@oneindiatelugu) January 30, 2024
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం నాడు హరిహరులకు విశేష పూజలు నిర్వహించారు. సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన ఆచార్యులు స్వయంభువులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించడం జరిగింది. ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు సంప్రదాయ రీతిలో జరిపించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications