వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తల్లికి జగన్ ఫోన్ ఓదార్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు) విద్యార్థి రోహిత్ తల్లి రాధికకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఫోన్ చేశారు. ఫోన్ ద్వారా ఆమెను మంగళవారంనాడు ఓదార్చారు.

ఆస్తుల వెల్లడికి దూరం: వైయస్ జగన్ సహా 13 మంది ఏపీ మంత్రులుఆస్తుల వెల్లడికి దూరం: వైయస్ జగన్ సహా 13 మంది ఏపీ మంత్రులు

వేముల రోహిత్ ఆత్మహత్యకు కారకులైనవారు ఎంతటివారైనా, ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే కఠినంగా శిక్షించాలని జగన్ డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన దురదృష్టకరమైన పరిణామాలను జనగ్ తీవ్రంగా పరిగణించారు.

YS Jagan calls dalith student Rohit's mother

రోహిత్ ఆత్మహత్యకు కారకులైనవారిని ఎట్టి పరిస్థితిలో కూడా వదలకూడదని ఆయన అన్నారు. రోహిత్ మృతికి సంతాపం ప్రకటిస్తూ అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హెచ్‌సియులో సాంఘిక బహిష్కరణకు గురైన రోహిత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

అతని ఆత్మహత్య వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. అతని ఆత్మహత్యకు నిరసనగా దళిత విద్యార్థులు విశ్వవిద్యాలయంలో ఆందోళన చేస్తున్నారు. వారికి రాజకీయ పార్టీల నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు మద్దతు ఇస్తున్నారు.

English summary
YSR Congress party president YS Jagan called Dalith student Rohit's mother radhika.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X