Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ షర్మిల విలీన సంకేతాలు- బంతి కాంగ్రెస్ కోర్టులో..!!

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అధికార భారత్ రాష్ట్ర సమితి.. తొలి విడత అభ్యర్థుల జాబితాను సైతం విడుదల చేయడానికి సన్నద్ధమైంది. బీఆర్ఎస్ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనల్లో బిజీగా ఉంటోన్నారు. ప్రగతి నివేదన సభలతో.. తమ ప్రభుత్వ లక్ష్యాలు, సాధించిన విజయాలను జనం ముందుంచుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలను అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోన్నాయి. బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కసరత్తు సాగిస్తోన్నాయి. ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అవసరమైన జనాకర్షణ హామీలను గుప్పిస్తోన్నాయి ఈ రెండు పార్టీలు.

YS Sharmila pays tribute to Rajiv Gandhi on his birth anniversary

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పరిస్థితి వీటికి భిన్నంగా ఉంటోంది. పాదయాత్రలో సంచలనం సృష్టించిన ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. రూటు మార్చినట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు లేదా విలీనం కోసం ప్రయత్నాలను సాగిస్తోన్నారనే ప్రచారం చాలాకాలం నుంచీ జోరుగా సాగుతోంది. ఇప్పటికే వైఎస్ షర్మిల ఈ దిశగా సంప్రదింపులు కూడా మొదలు పెట్టారంటూ వార్తలొచ్చాయి గానీ.. వాటిని ఆమె తోసిపుచ్చారు.

అయినప్పటికీ- విలీన లేదా పొత్తు వార్తలకు బ్రేకులు పడట్లేదు. దీనికి కారణాలు లేకపోలేదు. వీలైన ప్రతీసారీ వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ అగ్ర నేతలకు విషెస్ చెప్పడం, దానికి వారు స్పందించడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. ఒకదశలో కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఒప్పించడానికి వైఎస్సార్ కార్డ్‌ను బయటికి తీశారనీ చెబుతున్నారు.

బీఆర్ఎస్‌ను ఎదుర్కొనడంలో భాగంగా- భావసారూప్యం గల పార్టీలను కలుపుకెళ్లాలని అటు కాంగ్రెస్ భావిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే వామపక్షాలు బీఆర్ఎస్‌కు జై కొట్టాయి. వైఎస్ఆర్టీపీ విలీనం లేదా పొత్తు పెట్టుకోవడం అంటూ జరిగితే- అది ఏపీ రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.

ఈ పరిణామాల మధ్య తాజాగా వైఎస్ షర్మిల మరోసారి కాంగ్రెస్‌‌ వైపు తాను సానుకూలంగా ఉన్నట్లు మరో సంకేతాన్ని పంపించారు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళి అర్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజీవ్ గాంధీ- వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి దిగిన ఓ ఫొటోను ఆమె తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

లక్షలాది మంది జీవితాలను మార్చే లక్ష్యంతో ఈ ఇద్దరు యువ నాయకులు ముందుకు సాగారని పేర్కొన్నారు షర్మిల. దేశ ప్రజలు వారి సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు. రాజీవ్ గాంధీని 21వ శతాబ్దపు భారత్‌కు బాటలు వేసిన దూరదృష్టి గల నేతగా అభివర్ణించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+