టీటీడీ కిరీటాల మాయం ఇంటి దొంగల పనేనా? సీసీ కెమెరా లేదా?
తిరుపతి : ఏడుకొండలవాడు కొలువుదీరిన తిరుపతిలో మరోసారి దొంగలు పడ్డారు. గోవిందరాజ స్వామి ఆలయంలో 3 స్వర్ణ కిరీటాలు మాయమైన ఘటన దుమారం రేపుతోంది. కోదండరాముడి ఆలయంలో జరిగిన ఆభరణాల గోల్మాల్ మరవకముందే.. తాజాగా 50 లక్షల విలువచేసే కిరీటాలు మాయం కావడం చర్చానీయాంశంగా మారింది. పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు కిరీటాలు మాయమైన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు.

స్వర్ణ కిరీటాలు మాయం
తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఉత్సవ మూర్తులకు సంబంధించిన 3 స్వర్ణ కిరీటాలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. శనివారం సాయంత్రం వెలుగుచూసిన ఘటనపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీదేవి, భూదేవి, మలయప్పస్వామికి చెందిన 3 స్వర్ణ కిరీటాల బరువు 1351 గ్రాములు ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు 50 లక్షల రూపాయల విలువజేసే కిరీటాలు ఎవరు దొంగిలించారనేది సస్పెన్స్ గా మారింది. సెక్యూరిటీ సిబ్బంది కంటపడకుండా, సీసీ కెమెరాల కళ్లుగప్పి ఎలా ఎత్తుకెళ్లారనేది ప్రశ్నార్థకంగా మారింది.

సీసీ కెమెరా లేదా?
కోదండరామస్వామి ఆలయంలో జరిగిన ఆభరణాల గోల్మాల్ మరవకముందే.. తాజాగా గోవిందరాజ స్వామి ఆలయంలో.. 3 స్వర్ణ కిరీటాలు చోరీకి గురికావడం విస్మయానికి గురిచేస్తోంది. అయితే కిరీటాలు దొంగిలించిన కల్యాణమండపంలో సీసీ టీవి కెమెరా లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇదివరకు అక్కడ సీసీ కెమెరా ఉన్నా.. అది పనిచేయకపోవడంతో దాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. దాంతో నిందితులెవరనేది గుర్తించడం కష్టంగా మారింది. ఆలయ ప్రాంగణంలో 12 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, ప్రధానంగా చోరీ జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరా లేకపోవడం పోలీసులకు సవాల్ గా మారింది.

ఇంటి దొంగలేనా?.. దర్యాప్తు ముమ్మరం
మూడు స్వర్ణ కిరీటాలు మాయమైన ఘటనపై పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు వేగవంతం చేశారు. గోవిందరాజ స్వామి ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఆ మేరకు కొన్ని కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఇంటి దొంగలే కిరీటాలు మాయం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కిరీటాలు చోరీ జరిగిన నేపథ్యంలో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారి నగలకు భద్రత లేకుండా పోయిందంటూ ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దేవస్థానానికి సంబందించిన ఆలయాల దగ్గర భద్రత పెంచాలని కోరారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications