కేంద్ర మంత్రి, సీఎం రేసులో ఉన్న లీడర్ అలిపిరి టూ తిరుమలకు సింపుల్ గా!
తిరుమల/ తిరుపతి/బెంగళూరు: కర్ణాటకలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ నాయకులు ఆ భగవంతుడిని వేడుకుంటున్నారు. ఇప్పటికే సీఎం బసవరాజ్ బోమ్మయ్ దేవాలయాలు అన్ని చుట్టేసి బెంగళూరు చేరుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా తిరుపతి నుంచి కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా చూశారని కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి, బీఎల్ సంతోష్ మీద జగదీష్ శెట్టర్ తీవ్రస్థాయిలో ఇప్పటికి ఆరోపణలు చేస్తున్నారు. హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసిన జగదీష్ శెట్టర్ ను ఓడించడానికి బీజేపీ నాయకులు అనేక ఎత్తులు వేశారు.

అయితే ఎవ్వరికీ భయపడకుండా మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తాను కచ్చితంగా గెలుస్తానని ధీమాగా చెబుతున్నారు. కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి హుబ్బళిలోనే మకాం వేసి అక్కడ జగదీష్ శెట్టర్ ను ఓడించి బీజేపీ అభ్యర్థి మహేష్ టింగినకాయను గెలిపించడానికి అనేక ప్రయత్నాలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తరువాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సైలెంట్ గా తిరుపతి వెళ్లారు. తాను కేంద్ర మంత్రి అని మరిచిపోయి సింపుల్ గా ప్యాంట్, టీషర్టు వేసుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అలిపిరి నుంచి కాలినడకన తిరుమల బయలుదేరారు. తిరుపతికి చెందిన బీజేపీ నాయకులు సైతం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెంటలేరు.

ఇద్దరు పోలీసు, పర్సనల్ సెక్యూరిటీ గార్డులు మాత్రమే ప్రహ్లాద్ జోషి వెంట కాలినడకన తిరులమలకు బయలుదేరారు. ఆ సెక్యూరిటీ కూడా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి దూరంగా నడుచుకుంటూ తిరుమల చేరుకున్నారు. ప్రహ్లాద్ జోషిని చాలా మంది గుర్తు పట్టుకోవడంతో ఆయన సామాన్య భక్తుడిలా తిరుమల చేరుకున్నారు.
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కర్ణాటకలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని దేవుడిని ప్రార్థించారని తెలిసింది. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం రేసులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేరు కూడా ఉంది. కేంద్రంలోని పెద్దలతో నిత్యం టచ్ లో ఉంటున్న ప్రహ్లాద్ జోషి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ఇప్పటికే మంచి మార్కులు సంపాధించారు.

ప్రహ్లాద్ జోషి సీఎం అయితే పరిస్థితులు మరోలా ఉంటాయని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే కొందరు బీజేపీ పెద్దలు ప్రహ్లాద్ జోషి ఎందుకు సీఎం కాకూడదు అని బీజేపీలోని నాయకులనే కొందరిని ప్రశ్నించిన విషయం తెలిసిందే. మొత్తం మీద తనను విమర్శించిన వాళ్లు ఓడిపోవాలని, బీజేపీ హైకమాండ్ తనకు అప్పగించిన బాధ్యతలు నేరవేర్చాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తిరుమల వెళ్లి ఉంటారని తెలిసింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications